నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు మామూలు ఊపులో లేదు. యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు, రూలర్ సినిమాలతో పతనం చూసిన ఆయన.. మళ్లీ పుంజుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాలందుకుని కెరీర్లో మళ్లీ పీక్స్ను అందుకున్నాడు నందమూరి హీరో. ఇక ‘అఖండ-2’ ఆయన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.
‘అఖండ’కు సీక్వెల్ కావడం.. పాన్ ఇండియా ట్రెండును ఫాలో అవుతుండడంతో ఈ సినిమా వర్కవుట్ అయితే ఫలితం ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఐతే డిసెంబరు 5న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ల జోరు పెంచట్లేదని అభిమానులు కొంచెం ఫీలవుతున్నారు. కానీ టీం వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది.
దసరా, దీపావళి పండుగలకు క్రేజీ సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ రష్ ఉంది. ఈ హడావుడి అంతా అయ్యాక ‘అఖండ-2’ ప్రమోషన్లను మొదలుపెట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. పండుగ టైంలో మిగతా సినిమాలతో కలిసి రావడం కన్నా.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత విడిగా తమ కంటెంట్ను ప్రేక్షకుల ముందు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న ‘అఖండ-2’ కొత్త టీజర్ రాబోతోందట. నిమిషం పైగా నిడివి ఉండే ఈ ప్రోమో ఒక బ్లాస్ట్ లాగా ఉంటుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో బజ్ పెంచేలా ఈ ప్రోమోను దర్శకుడు బోయపాటి శ్రీను డిజైన్ చేశాడట. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కథకు భారీతనం జోడిస్తే.. దేశవ్యాప్తంగా ఆ సినిమాకు బజ్ వస్తోంది. ‘అఖండ-2’ అచ్చంగా అలాంటి సినిమానే. ఈ టీజర్ తర్వాత లెక్క వేరుగా ఉంటుందని.. ఇక్కడ్నుంచి మొదలుపెట్టి సినిమా రిలీజ్ వరకు క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉంటారట. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబరు 5న ‘అఖండ-2’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 20, 2025 10:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…