హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన కొత్త రిలీజ్ ఏదైనా ఉందంటే ఏపీ తెలంగాణలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య విశాల్ మాటలు, చేతల పరంగా చూపిస్తున్న దూకుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మగుడం దర్శకుడు రవి అరసుని మార్చేసి తనే మెగా ఫోన్ చేపట్టడం పట్ల డైరెక్టర్ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. గతంలో మిస్కిన్ తో గొడవపడి డిటెక్టివ్ 2 ని డోలాయమానంలో పడేసిన విశాల్ తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డులను చులకనగా మాట్లాడ్డం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
వంద కోట్లకు పైగా ప్రజలున్న దేశంలో కేవలం ఒక ఏడెనిమిది మంది జ్యురీ సభ్యులు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడని అవార్డులను ఎలా ఎంపిక చేస్తారని, ఇదంతా నాన్సెన్స్ అని చెబుతూనే నేనైతే జాతీయ పురస్కారం దక్కినా చెత్తబుట్టలో పారేస్తానని చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నేషనల్ అవార్డుల గురించి అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు వీటిని అందుకున్నారు. ఇటీవలే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే వరించినప్పుడు భాషతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఆ మాకొస్తే ఆస్కార్ ని ఎంపిక చేసేది కూడా పరిమిత సభ్యులే. కమిటీ చిన్నదైనా పెద్దదైనా లిమిటెడ్ నెంబరే ఉంటుంది. అంతే తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మెంబెర్ గా చేసుకోవడం అసాధ్యం. ఏమైనా సరే విశాల్ ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించాక పరిశ్రమలో ఇమేజ్ పెరిగిన విశాల్ ఇప్పుడిలాంటి వ్యాఖ్యల ద్వారా లేనిపోని రాద్ధాంతానికి అవకాశం ఇస్తున్నాడు. ధన్సికని త్వరలో పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్న విశాల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మగుడం రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బహుశా క్రిస్మస్ ఉండొచ్చు.
This post was last modified on October 19, 2025 1:01 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…