హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన కొత్త రిలీజ్ ఏదైనా ఉందంటే ఏపీ తెలంగాణలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య విశాల్ మాటలు, చేతల పరంగా చూపిస్తున్న దూకుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మగుడం దర్శకుడు రవి అరసుని మార్చేసి తనే మెగా ఫోన్ చేపట్టడం పట్ల డైరెక్టర్ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. గతంలో మిస్కిన్ తో గొడవపడి డిటెక్టివ్ 2 ని డోలాయమానంలో పడేసిన విశాల్ తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డులను చులకనగా మాట్లాడ్డం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
వంద కోట్లకు పైగా ప్రజలున్న దేశంలో కేవలం ఒక ఏడెనిమిది మంది జ్యురీ సభ్యులు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడని అవార్డులను ఎలా ఎంపిక చేస్తారని, ఇదంతా నాన్సెన్స్ అని చెబుతూనే నేనైతే జాతీయ పురస్కారం దక్కినా చెత్తబుట్టలో పారేస్తానని చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నేషనల్ అవార్డుల గురించి అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు వీటిని అందుకున్నారు. ఇటీవలే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే వరించినప్పుడు భాషతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఆ మాకొస్తే ఆస్కార్ ని ఎంపిక చేసేది కూడా పరిమిత సభ్యులే. కమిటీ చిన్నదైనా పెద్దదైనా లిమిటెడ్ నెంబరే ఉంటుంది. అంతే తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మెంబెర్ గా చేసుకోవడం అసాధ్యం. ఏమైనా సరే విశాల్ ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించాక పరిశ్రమలో ఇమేజ్ పెరిగిన విశాల్ ఇప్పుడిలాంటి వ్యాఖ్యల ద్వారా లేనిపోని రాద్ధాంతానికి అవకాశం ఇస్తున్నాడు. ధన్సికని త్వరలో పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్న విశాల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మగుడం రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బహుశా క్రిస్మస్ ఉండొచ్చు.
This post was last modified on October 19, 2025 1:01 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…