Movie News

వద్దన్నా వివాదాలెందుకు విశాల్

హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అందుకే ఎన్ని ఫ్లాపులు వచ్చినా తన కొత్త రిలీజ్ ఏదైనా ఉందంటే ఏపీ తెలంగాణలోనూ సమాంతరంగా రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య విశాల్ మాటలు, చేతల పరంగా చూపిస్తున్న దూకుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మగుడం దర్శకుడు రవి అరసుని మార్చేసి తనే మెగా ఫోన్ చేపట్టడం పట్ల డైరెక్టర్ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. గతంలో మిస్కిన్ తో గొడవపడి డిటెక్టివ్ 2 ని డోలాయమానంలో పడేసిన విశాల్ తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డులను చులకనగా మాట్లాడ్డం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.

వంద కోట్లకు పైగా ప్రజలున్న దేశంలో కేవలం ఒక ఏడెనిమిది మంది జ్యురీ సభ్యులు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడని అవార్డులను ఎలా ఎంపిక చేస్తారని, ఇదంతా నాన్సెన్స్ అని చెబుతూనే నేనైతే జాతీయ పురస్కారం దక్కినా చెత్తబుట్టలో పారేస్తానని చెప్పడం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నేషనల్ అవార్డుల గురించి అంత అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందరో మహానుభావులు వీటిని అందుకున్నారు. ఇటీవలే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే వరించినప్పుడు భాషతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అందరూ హర్షం వ్యక్తం చేశారు.

ఆ మాకొస్తే ఆస్కార్ ని ఎంపిక చేసేది కూడా పరిమిత సభ్యులే. కమిటీ చిన్నదైనా పెద్దదైనా లిమిటెడ్ నెంబరే ఉంటుంది. అంతే తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మెంబెర్ గా చేసుకోవడం అసాధ్యం. ఏమైనా సరే విశాల్ ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించాక పరిశ్రమలో ఇమేజ్ పెరిగిన విశాల్ ఇప్పుడిలాంటి వ్యాఖ్యల ద్వారా లేనిపోని రాద్ధాంతానికి అవకాశం ఇస్తున్నాడు. ధన్సికని త్వరలో పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కాబోతున్న విశాల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. మగుడం రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. బహుశా క్రిస్మస్ ఉండొచ్చు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

8 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago