టాలీవుడ్ ఒకప్పుడు దీపావళి సీజన్ మీద పెద్దగా ఫోకస్ చేసేది కాదు. సంక్రాంతి, దసరాల మీద ఉన్నంత దృష్టి ఈ పండుగ మీద ఉండదు. కానీ గత ఏడాది కథ మారింది. దీపావళి టాలీవుడ్కు భలేగా కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు అనువాద చిత్రమైన అమరన్ చాలా బాగా ఆడాయి. ఇలా ఒక పండుగ సీజన్లో రిలీజైన మూడు సినిమాలూ సక్సెస్ కావడం అరుదు. అందుకేనేమో ఈసారి పండక్కి ఏకంగా నాలుగు సినిమాలను బరిలోకి దించారు.
అందులో మూడు డైరెక్ట్ మూవీస్ కాగా.. ఒకటి అనువాదం. ఈ నాలుగు చిత్రాల మీదే ఓ మోస్తరు అంచనాలే నిలిచాయి. మరి వీటిలో దీపావళి విజేతగా ఏది నిలుస్తుంది.. గత ఏడాది లాగే 100 పర్సంట్ సక్సెస్ రేట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. ఐతే ఈసారి దీపావలి ఆరంభమే తీవ్ర నిరాశకు గురి చేసింది. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ తరహలో నవ్వుల్లో ముంచెత్తుతందనుకున్న ‘మిత్రమండలి’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే సినిమాకు వసూళ్లు లేవు. ప్రేక్షకులు ఔట్ రైట్గా ఈ చిత్రాన్ని తిరస్కరించారు.
ఇక శుక్రవారం రిలీజైన డ్యూడ్, తెలుసు కదా చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. డ్యూడ్ యూత్ను ఆకట్టుకున్నప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఐతే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘తెలుసు కదా’ క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది కానీ.. ఎక్కువమంది బోర్ అనే అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించేలా ఉన్నారు. రివ్యూస్ మోడరేట్గా వచ్చాయి.
ఇక రేసులో చివరగా వచ్చిన ‘కే ర్యాంప్’కు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఇందులో మాస్ కామెడీ యూత్, మాస్కు ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. ‘కే ర్యాంప్’కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో స్పందన బాగుంది. ఈ దీపావళికి క్లియర్ విన్నర్ అంటూ ఏ సినిమా లేదు. ఓపెనింగ్స్ పరంగా డ్యూడ్, కే ర్యాంప్ బెటర్గా పెర్ఫామ్ చేసేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విన్నర్ ఎవరనేది ఒక వారం గడిస్తే కానీ చెప్పలేం.
This post was last modified on October 19, 2025 7:42 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…