టాలీవుడ్ ఒకప్పుడు దీపావళి సీజన్ మీద పెద్దగా ఫోకస్ చేసేది కాదు. సంక్రాంతి, దసరాల మీద ఉన్నంత దృష్టి ఈ పండుగ మీద ఉండదు. కానీ గత ఏడాది కథ మారింది. దీపావళి టాలీవుడ్కు భలేగా కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు అనువాద చిత్రమైన అమరన్ చాలా బాగా ఆడాయి. ఇలా ఒక పండుగ సీజన్లో రిలీజైన మూడు సినిమాలూ సక్సెస్ కావడం అరుదు. అందుకేనేమో ఈసారి పండక్కి ఏకంగా నాలుగు సినిమాలను బరిలోకి దించారు.
అందులో మూడు డైరెక్ట్ మూవీస్ కాగా.. ఒకటి అనువాదం. ఈ నాలుగు చిత్రాల మీదే ఓ మోస్తరు అంచనాలే నిలిచాయి. మరి వీటిలో దీపావళి విజేతగా ఏది నిలుస్తుంది.. గత ఏడాది లాగే 100 పర్సంట్ సక్సెస్ రేట్ ఉంటుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. ఐతే ఈసారి దీపావలి ఆరంభమే తీవ్ర నిరాశకు గురి చేసింది. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ తరహలో నవ్వుల్లో ముంచెత్తుతందనుకున్న ‘మిత్రమండలి’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే సినిమాకు వసూళ్లు లేవు. ప్రేక్షకులు ఔట్ రైట్గా ఈ చిత్రాన్ని తిరస్కరించారు.
ఇక శుక్రవారం రిలీజైన డ్యూడ్, తెలుసు కదా చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చింది. డ్యూడ్ యూత్ను ఆకట్టుకున్నప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఐతే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘తెలుసు కదా’ క్లాస్ ప్రేక్షకులను మెప్పించింది కానీ.. ఎక్కువమంది బోర్ అనే అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఆదరించేలా ఉన్నారు. రివ్యూస్ మోడరేట్గా వచ్చాయి.
ఇక రేసులో చివరగా వచ్చిన ‘కే ర్యాంప్’కు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఇందులో మాస్ కామెడీ యూత్, మాస్కు ఎక్కుతున్నట్లే కనిపిస్తోంది. ‘కే ర్యాంప్’కు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలో స్పందన బాగుంది. ఈ దీపావళికి క్లియర్ విన్నర్ అంటూ ఏ సినిమా లేదు. ఓపెనింగ్స్ పరంగా డ్యూడ్, కే ర్యాంప్ బెటర్గా పెర్ఫామ్ చేసేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విన్నర్ ఎవరనేది ఒక వారం గడిస్తే కానీ చెప్పలేం.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…