అంచనాలకు మించి ఆడేసిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తాజాగా ఏడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. నెట్ లెక్కల్లో చూసుకుంటే సుమారు అయిదు వందల కోట్ల దాకా తేలుతుంది. ఇప్పటిదాకా ఇంత మొత్తాన్ని సాధించిన పదిహేనవ ఇండియన్ మూవీగా కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఏపీ తెలంగాణలో బాగా నెమ్మదించినప్పటికీ కాంతార చాప్టర్ 1 ఇప్పటికీ కర్ణాటకలో స్ట్రాంగ్ గా ఉంది. మూడో వారం పూర్తి చేసుకోబోతున్నా అక్కడ హౌస్ ఫుల్స్ నమోదవుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ట్రెండింగ్ కి అదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. హిందీలోనూ మంచి గ్రిప్ అందుకున్న కాంతార అక్కడ వంద కోట్లు దాటేసింది.
ఇప్పుడప్పుడే కాంతార ఫైనల్ రన్ కు రాకపోవచ్చు. తెలుగు, తమిళంలో కొత్త సినిమాలు వచ్చాయి కానీ కన్నడలో దీన్ని దాటుకునే స్థాయిలో ఏ రిలీజు జరగలేదు. అందుకే అక్కడ వసూళ్ల సునామి కొనసాగుతోంది. అయితే వెయ్యి కోట్ల కలను నెరవేర్చుకుంటుందని భావించిన అభిమానులు నిరాశ పడక తప్పేలా లేదు. ఎందుకంటే ఇంకో మూడు వందల కోట్లు రావాలంటే కాంతార చాప్టర్ 1 అద్భుతాలు చేయాలి. మళ్ళీ పికప్ కావాలి. కానీ డ్యూడ్, కె ర్యాంప్ లు డీసెంట్ నుంచి పాజిటివ్ మధ్యలో రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ వాటి వైపు షిఫ్ట్ అయిపోయారు. ఇది బాగా ప్రభావితం చేసే అంశం.
కాకపోతే కూలీ కన్నా చాలా మెరుగ్గా కాంతార ఆడటం విశేషం, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజాలు అందరూ కలిసి నటించినా కాంతార చాప్టర్ 1 సాధించిన వసూళ్లకు దగ్గరగా కూడా వెళ్లలేకపోయారు. అలాంటిది ఒక పల్లెటూరి గ్రామీణ సాంప్రదాయాన్ని గొప్పగా ఆవిష్కరించిన రిషబ్ శెట్టి అంత సులభంగా అందుకోలేని గొప్ప ఫలితం సాధించాడు. ఆదివారంతో కలిపి పండగ హడావిడి మూడు రోజులు ఉంటుంది కాబట్టి కాంతార మళ్ళీ పికప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే హోంబాలే ఫిలిమ్స్ తెలివిగా కొత్త కొత్త ట్రైలర్లు కట్ చేసి ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే పనిలో ఉంది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…