మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్కు ఇప్పుడు ఓ పెద్ద హిట్ చాలా అవసరం. యాక్సిడెంట్ తర్వాత నటించిన తొలి చిత్రం ‘విరూపాక్ష’ పెద్ద హిట్టయినా.. తన కెరీర్ వేగం పుంజుకోలేదు. తన మావయ్య పవన్ కళ్యాణ్తో తొలిసారి కలిసి నటించిన ‘బ్రో’ నిరాశపరిచింది. యాక్సిడెంట్ తాలూకు ఇబ్బందుల వల్ల గ్యాప్ తీసుకోవడం.. ‘గాంజా శంకర్’ క్యాన్సిల్ కావడంతో తేజు కెరీర్లో గ్యాప్ వచ్చింది.
తర్వాత రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ‘హనుమాన్’ నిర్మాతలు వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. రంగంలోకి దిగాక ఖర్చు అంచనాలను మించిపోయింది. కొన్ని రోజులు టీం సైలెంటుగా ఉండిపోయింది. ఇటీవలే ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్ ప్రేక్షకులను పలకరించింది. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది.
అనగనగా ఒక వెనుకబడ్డ ప్రాంతం.. అక్కడో తెగ.. వారి మీద దారుణమైన అకృత్యాలు జరుగుతుంటాయి. అక్కడి జనం అల్లాడిపోతుంటారు. అప్పుడు ఒక రక్షకుడు వచ్చి వారికి నాయకత్వం వహిస్తాడు. వీరోచితంగా పోరాడతాడు. ఇప్పుడు భాషా భేదం లేకుండా ఈ కథలే ట్రెండుగా మారాయి. ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించి హీరోతో రక్షకుడి అవతారం ఎత్తించి భారీ యాక్షన్ ఘట్టాలు, ఎలివేషన్లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.
కాకపోతే వివిధ భాషల్లో గత కొన్నేళ్లలో ఈ తరహా సినిమాలు చాలా వచ్చేశాయి. వీటి డోస్ ఎక్కువైపోయి జనాలకు మొహం మొత్తేసే పరిస్థితి వచ్చింది. ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్లో విజువల్స్, భారీతనం, తేజు లుక్, తన డైలాగ్స్ అన్నీ బాగున్నా సరే.. ఇలాంటివి గత కొన్నేళ్లలో చాలా చూసేశాం కదా అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి కథను తేజు కొన్నేళ్ల ముందు చేయాల్సిందని.. అప్పుడైతే తనకు పెద్ద బ్రేకే వచ్చేదని.. ఇలాంటి సినిమాల డోస్ బాగా ఎక్కువైపోయి ప్రేక్షకులు మొనాటనస్ ఫీలింగ్లోకి వచ్చేసిన సమయంలో రానున్న ఈ సినిమా ఎంతమేర వారిని మెప్పిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
This post was last modified on October 17, 2025 8:52 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…