Movie News

కమెడియన్ రెస్టారెంట్‌పై కాల్పులు.. ఇది మూడోసారి!

భారతీయ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని రెస్టారెంట్‌పై కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ రెస్టారెంట్‌ను కేవలం నాలుగు నెలల్లో మూడోసారి టార్గెట్ చేశారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ తరహా ఘటనలు కెనడాలోని భారతీయ కమ్యూనిటీ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ దాడికి గోల్డీ ధిల్లాన్, కుల్దీప్ సింధు అనే గ్యాంగ్‌స్టర్లు తామే అని చెప్పుకున్నారు. తాజాగా జరిగిన దాడి తర్వాత గోల్డీ ధిల్లాన్ పేరుతో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో “మేము కప్స్ కేఫ్ (కపిల్ శర్మ రెస్టారెంట్) పై జరిగిన మూడు కాల్పులకు బాధ్యత వహిస్తున్నాం. సాధారణ ప్రజలతో మాకు శత్రుత్వం లేదు” అని హెచ్చరించారు. ఈ ఘటనతో రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లలో భయం నెలకొంది.

ఈ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక కేవలం కెనడాకే పరిమితం కాలేదు. వైరల్ అవుతున్న పోస్ట్ స్క్రీన్‌షాట్‌లో, “నేను కపిల్ శర్మకు ఫోన్ చేశాను, కానీ అతను రెస్పాండ్ కాలేదు” అని ఉంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, “అతను ఇప్పటికీ రింగ్ వినకపోతే, తదుపరి చర్య ముంబైలో జరుగుతుంది” అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ బెదిరింపుతో భారతీయ సినీ పరిశ్రమ కూడా భయపడుతోంది.

కపిల్ శర్మ రెస్టారెంట్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. జూలై 10న జరిగిన మొదటి దాడిలో కొంతమంది ఉద్యోగులు లోపలే ఉన్నారు. ఆ తర్వాత ఆగస్టు 8న జరిగిన రెండో దాడిలో ఏకంగా 25 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు తెలిసింది. కేవలం నాలుగు నెలల్లో మూడుసార్లు ఒకే వ్యాపార సంస్థపై కాల్పులు జరగడంతో అలజడి మొదలైంది.

ఈ దాడి జరగడానికి కొద్ది రోజుల ముందు, కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఒక ‘టెర్రర్ ఎంటిటీ’ (ఉగ్ర సంస్థ)గా ప్రకటించింది. ఈ గ్యాంగ్ తమ దేశంలోని నిర్దిష్ట కమ్యూనిటీలను, ముఖ్యంగా ప్రో-ఖలిస్తాన్ అంశాలను టార్గెట్ చేస్తోందని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఈ టెర్రర్ లిస్ట్‌లో చేర్చిన తర్వాత జరిగిన మొదటి దాడి ఇదే. కపిల్ శర్మపై జరిగిన ఈ దాడికి కారణం ఏమిటనే దానిపై స్పష్టత లేకపోయినా, ఈ సంఘటనతో కెనడాలో ఉన్న భారతీయ ప్రముఖులు ప్రవాస భారతీయుల భద్రతపై పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ల ఈ తరహా బెదిరింపులను నియంత్రించడానికి రెండు దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on October 16, 2025 11:27 pm

Share

Recent Posts

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

5 minutes ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

1 hour ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

1 hour ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

2 hours ago

కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్నీ… వదలమంటున్న బొద్దింకలు

ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…

2 hours ago

కలకలం… 140 కోట్ల మందిపై ‘డ్రాగన్’ నిఘా?

అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…

5 hours ago