మాస్ మహారాజా రవితేజ హిట్టు ఫ్లాపు పక్కన పెడితే తనవరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు వీలైనంత ఎక్స్ పరిమెంట్లు చేసేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు. ధమాకా లాంటి ఊర మాస్ మూవీ తర్వాత రావణాసురలో నెగటివ్ షేడ్ చేశారు. టైగర్ నాగేశ్వరరావులో పీరియాడిక్ డ్రామా టచ్ చేశారు. ఈగల్ మరో కొత్త తరహా ప్రయత్నం. ఇవన్నీ సక్సెస్ కాకపోవడం వల్ల జనంలోకి వేగంగా వెళ్లలేకపోతున్నాయి. ఒకవేళ వీటిలో సగం విజయవంతమైనా ఇతర బాషల నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం ఎగబడే వాళ్ళు. అలాని రవితేజ ప్రయోగాలు ఆపడం లేదు. కొనసాగిస్తూనే ఉంటారని లైనప్ చెబుతోంది.
ముందు మాస్ జాతర తీసుకుంటే ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసం వండుతున్న మాస్ మీల్స్. విక్రమార్కుడు, కిక్, కృష్ణ తరహా హీరోయిజంతో కూడిన ఫన్ ఇందులో బోలెడు ఉంటుంది. డాన్స్ పరంగా శ్రీలీల ఎలాగూ ఉంది కాబట్టి అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు భాను భోగవరపు చూసుకుంటున్నాడు. సంక్రాంతికి రాబోయే కిషోర్ తిరుమల మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మాస్ ఎలిమెంట్స్ కన్నా ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేయబోతున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చేసింది. సో కూల్ ఎంటర్ టైనర్ రాబోతోందన్న మాట.
మజిలీ ఫేమ్ శివ నిర్వాణం డైరెక్షన్లో చేయబోయే సినిమా ఎమోషన్స్ కన్నా ఎక్కువగా థ్రిల్లింగ్, యాక్షన్ మోడ్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెల షూటింగ్ మొదలుపెట్టొచ్చు. వీటి తర్వాత కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మూవీ చేయబోతున్నారు రవితేజ. కొంచెం ఆలస్యమైనా ప్యాన్ ఇండియా రేంజ్ లో పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సితార సంస్థ రెడీ అవుతోంది. రవితేజ ఎప్పుడూ శక్తులు ఉన్న సూపర్ హీరోగా నటించలేదు. ఏది ఏమైనా తనకన్నా చాలా చిన్న వయసు హీరోల కన్నా రవితేజ వేగంగా పరుగులు పెట్టడం చూస్తే ఎవరికైనా స్ఫూర్తే అనిపిస్తుంది.
This post was last modified on October 16, 2025 5:16 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…