మాములుగా దీపావళికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేసేవి. కానీ ఈసారి దానికి భిన్నంగా అందరూ కొత్త వాళ్ళు దర్శకత్వం వహించిన నాలుగు యూత్ మూవీస్ బరిలో ఉండటం ఒక రకమైన విచిత్రమైన వాతావరణం ఏర్పరిచింది. దేనికీ భీభత్సమైన బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ గా లేవు. సిద్ధూ జొన్నలగడ్డ లాంటి క్రేజ్ ఉన్న హీరో నటించిన తెలుసు కదా సైతం ఇప్పుడిప్పుడే బజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ నాటి వేడి కనిపించడం లేదు. ఇది కేవలం జాక్ ఎఫెక్ట్ అని చెప్పలేం. తెలుసు కదా జానర్ తో పాటు కాన్సెప్ట్ కొంచెం క్లిష్టంగా ఉండటం హైప్ పెంచలేకపోయింది.
టీజర్ లో బూతులున్నాయనే కామెంట్స్ తో ప్రమోషన్లు మొదలుపెట్టుకున్న కె ర్యాంప్ మెల్లగా ఆ ముద్రని తగ్గించుకుని ట్రైలర్ తో డ్యామేజ్ రిపేర్ దాదాపు చేసింది. హీరో కిరణ్ అబ్బవరం స్టేట్ మెంట్లు, పక్క భాష హీరో మీద చూపించిన సానుభూతి వగైరాలో సోషల్ మీడియాలో మాట్లాడుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ సినిమా పరంగా ఎంత హెల్ప్ అవుతాయో తేలేది శనివారం రోజే. ఇక ముందు చెప్పుకోవాల్సిన మిత్రమండలి గురించి చివరిగా చెప్పడానికి కారణం క్యాస్టింగ్. ముందు రోజు ప్రీమియర్లకు సిద్ధపడిన ఈ ఎంటర్ టైనర్ మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తి తీరుతుందని హీరో ప్రియదర్శి బల్లగుద్ది చెబుతున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే తమిళ డబ్బింగ్ డ్యూడ్ కూడా మంచి రిలీజే దక్కించుకుంటోంది. మైత్రి ప్రొడక్షన్ కావడంతో థియేటర్ కౌంట్ బాగానే దక్కుతోంది. ప్రదీప్ రంగనాథన్ కి తెలుగులో మార్కెట్ పెరిగిందనే కోణంలో మంచి విడుదలే చేయిస్తున్నారు. మమిత బైజు హీరోయిన్ కావడం యూత్ పరంగా అదనపు ఆకర్షణ అవుతోంది. నలుగురు డెబ్యూ డైరెక్టర్లు తీసిన ఈ నాలుగు సినిమాల్లో ఎవరు దీపావళి టపాసుల్లా పేలిపోతారో లేక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కలెక్షన్లు పేలుస్తారో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది. ఇవాళ అర్ధరాత్రి మిత్రమండలి రూపంలో మొదటి పరీక్ష ఫలితం వచ్చేస్తుంది. చూడాలి బోణీ ఎలా ఉండబోతోందో.
This post was last modified on October 16, 2025 7:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…