రిషబ్ శెట్టి.. మూడేళ్ల ముందు వరకు కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో కమ్ డైరెక్టర్. తన గురించి కర్ణాటక అవతల పెద్దగా తెలియదు. కానీ ‘కాంతార’తో అంతా మారిపోయింది. కన్నడలో రిలీజైన రెండు వారాల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది.
ఎవ్వరూ ఊహించని విధంగా రూ.400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద సంచనాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ చిత్రం.. పెట్టుబడి మీద 25 రెట్లకు మించి వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అంతే కాక కర్ణాటకలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఫుల్ రన్లో కర్ణాటకలో రూ.180 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ‘కాంతార’.. ‘కేజీఎఫ్-2’ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేసింది.
ఇప్పుడు తాను నెలకొల్పిన రికార్డును మళ్లీ తనే బద్దలు కొట్టాడు రిషబ్ శెట్టి. ‘కాంతార: చాప్టర్-1’.. ‘కాంతార’ పేరిట ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును తాజాగా బద్దలు కొట్టేసింది. కర్ణాటకలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.180 కోట్లను దాటిపోయాయి. ఇంతకుముందు ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో వరుసగా రెండు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు యశ్. ఇప్పుడు ‘కాంతార’, దాని ప్రీక్వెల్తో రిషబ్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు.
విశేషం ఏంటంటే.. ఈ నాలుగు చిత్రాలనూ నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ. అదే.. హోంబలే ఫిలిమ్స్. కేజీఎఫ్, కాంతార సినిమాలు మొదలైనపుడు అవి అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని.. వాటికి కొనసాంగింపుగా సినిమాలు వస్తాయని.. అవి మరింతగా దేశాన్ని ఊపేస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇలాంటి సినిమాలను నమ్మి ముందే భారీ స్థాయిలో నిర్మించడం హోంబలే ఫిలిమ్స్ ఘనతగానే చెప్పాలి.
This post was last modified on October 15, 2025 5:50 pm
తెలుగు సినిమాలకు మార్కెట్ పరంగా అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ఉన్నట్లుండి కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలు కావడం…
మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్…
ఇంకా ఏడాది సమయం ఉండగానే టాలీవుడ్ సంక్రాంతి మీద విపరీతమైన హైప్ నెలకొంది. షూటింగులు మొదలుపెట్టకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,…
ఇండియాలో వెబ్ సిరీస్లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్,…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…
వైసీపీ నేతలు, ఆ పార్టీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రెండు…