Movie News

రెండోసారి… మరో దర్శకుడితో విశాల్ విభేదాలు

దర్శకుడితో సరైన కో ఆర్డినేషన్ ఉంటేనే సినిమా బాగా వస్తుంది. అది చిన్నదా పెద్దదా లేక ప్యాన్ ఇండియాదా అన్నది కాదు ప్రశ్న. ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగా కుదిరితే తెరమీద అంత అద్భుతాలు జరుగుతాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్లు రాజమౌళితో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు చేయగలిగారు. చిరంజీవికి కోదండరామిరెడ్డితో, స్వర్గీయ ఎన్టీఆర్ కు రాఘవేంద్రరావుతో ఇలాంటి రిలేషన్ షిప్పే ఉండేది. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం విశాల్. తన కొత్త మూవీ మగుడం డైరెక్టర్ రవి అరసుతో వచ్చిన విభేదాల కారణంగా ఇప్పుడు మెగా ఫోన్ చేపట్టి బాలన్స్ షూటింగ్ చేసేస్తున్నాడు.

కారణాలు ఇంకా తెలియలేదు కానీ ప్రస్తుతానికి మగుడం చేతులు మారిపోయింది. అయితే విశాల్ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు. డిటెక్టివ్ 2 టైంలో మిస్కిన్ తో అచ్చం ఇలాగే జరిగింది. గొడవ తీవ్రంగా ముదిరిపోయి నువ్వా నేనా అనేసుకున్నారు. కట్ చేస్తే డిటెక్టివ్ 2 నేనే తీస్తానని ప్రకటించిన విశాల్ కంటిన్యూ చేశాడు కానీ ఎందుకనో తర్వాత ఆపేశాడు. ఇప్పటిదాకా దాని అప్డేట్ లేదు. ఇప్పుడు రవి అరసుతో క్రియేటివ్ డిఫరెన్స్ కాస్తా మగుడం మీద ప్రభావం చూపిస్తోంది. తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్న విశ్వాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ ని పూర్తి చేశాక పరిశ్రమలో మంచి పేరే తెచ్చుకున్నాడు. ఈలోగా ఇది జరిగింది.

మగుడంలో దూశారా విజయన్ హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ సంగీతం సమకూర్చగా అంజలి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథా నేపధ్యం లాంటి వివరాలు బయటికి రాలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ కొంచెం ఇంటరెస్టింగ్ గానే అనిపించింది. తెలుగులో మార్కెట్ బాగా తగ్గిపోయిన విశాల్ కు వరస ఫెయిల్యూర్స్ తీవ్ర ప్రభావం చూపించాయి. అభిమన్యుడుతో పుంజుకున్నట్టు అనిపించినా తర్వాత ఫ్లాపులతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మగుడం మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. కమల్ హాసన్ కు క్షత్రియ పుత్రుడులాగా ఇది తనకు స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని భావిస్తున్నాడు.

This post was last modified on October 15, 2025 3:30 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vishal

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

16 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago