తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన విజయ్ నటించిన కొత్త సినిమా మాస్టర్. ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాళవిక మోహనన్ కథానాయికగా, విజయ్ సేతుపతి విలన్గా నటించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే గత కొన్ని నెలల నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడం.. దాన్ని నిర్మాతలు ఖండించడం పరిపాటిగా మారింది. కానీ ఎంతకీ ఈ ప్రచారాలు ఆగలేదు. దీంతో నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ ద్వారా మాస్టర్ రిలీజ్ గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇన్ని రోజులూ తమ చిత్రం ఓటీటీలోకి రాదని మాత్రమే చెబుతూ వచ్చిన మాస్టర్ నిర్మాతలు.. ఇప్పుడు ఓటీటీలతో చర్చలు జరిగిన మాట వాస్తవమే అని పరోక్షంగా చెప్పారు. ఒక పెద్ద ఓటీటీ సంస్థ తమ చిత్రానికి పెద్ద ఆఫర్ ఇచ్చిందని.. కానీ దాన్ని తాము అంగీకరించలేదని మాస్టర్ నిర్మాతలు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీని రక్షించడానికి మాస్టర్ లాంటి భారీ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడమే కరెక్ట్ అని.. ఇలాంటి సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి స్థాయిలో ఆస్వాదించగలమని వారు పేర్కొన్నారు. కాబట్టి థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో అప్పుడు తమ చిత్రాన్ని అక్కడే రిలీజ్ చేస్తామని, అభిమానులు అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడాలని నిర్మాతలు స్పష్టం చేశారు. సంక్రాంతికి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిస్తే అప్పుడు, లేదంటే వేసవికి మాస్టర్ విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on November 28, 2020 10:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…