నిన్ను కోరి, మజిలీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో విజయాలు సాధించిన దర్శకుడు శివ నిర్వాణ, తక్కువ సమయంలో టాప్ డైరెక్టర్ అవుతాడని భావించిన అంచనాలకు భిన్నంగా రెండు ఫ్లాపులతో బాగా నెమ్మదించేశారు. నాని టక్ జగదీశ్ ఓటిటి రిలీజైనా తీవ్రంగా నిరాశపరచగా ఖుషి అతి కష్టం మీద యావరేజ్ దగ్గర ఆగిపోయింది. తన మునుపటి స్థాయి సెన్సిబిలిటీస్ ఈ సినిమాల్లో పూర్తిగా కనిపించలేదన్నది వాస్తవం. ఇదిలా ఉండగా ఖుషి కాకుండా మైత్రి మూవీ మేకర్స్ కి శివ నిర్వాణ గతంలోనే మరో కమిట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడది రవితేజతో ప్రాజెక్టు రూపంలో సాకారం కాబోతోంది. ఈ లీక్ ఆగస్ట్ లోనే వచ్చింది.
తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం శివ నిర్వాణ ఈసారి మాస్ రూట్ పట్టబోతున్నారు. అలాని రొటీన్ ఫార్ములాతో రవితేజని బోర్ కొట్టే విధంగా చూపించడం కాదు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్టుతో ఊహించని ట్విస్టులతో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ట్రీట్ మెంట్ రాసుకున్నారని వినికిడి. ఫాదర్ సెంటిమెంట్, రివెంజ్, ఎమోషన్స్ వీటిని బ్యాలన్స్ చేస్తూ తనలో కొత్త మేకర్ ని పరిచయం చేసే పనిలో శివ నిర్వాణ ఉన్నట్టు సమాచారం. అందుకే కథకు తగ్గట్టు సంగీతం అందించడానికి అజనీష్ లోకనాథ్ ని దాదాపు లాక్ చేసుకున్నట్టు వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.
రవితేజ విషయానికి వస్తే మాస్ జాతర అక్టోబర్ 31 విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి ( ప్రచారంలో ఉన్న టైటిల్) 2026 సంక్రాంతి బరిలో ఉండటం ఖాయం. వీటి తర్వాత శివ నిర్వాణదే లాక్ అయ్యింది. రవితేజ ఎక్కువ సినిమాలు చేస్తున్న బ్యానర్లలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తర్వాతి స్థానం మైత్రిదే. హీరోయిన్, ఇతర టెక్నికల్ టీమ్ ఎంపికలో శివ నిర్వాణ బిజీగా ఉన్నారట. సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజ అభిమానులకు కేవలం ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే పండగే.
This post was last modified on October 14, 2025 12:15 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…