టిల్లు బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ వారమే తెలుసు కదాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది జాక్ తో కొంచెం యాక్షన్ రూటు పడదామని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తిరిగి తన స్కూలుకు వచ్చేశాడు. ప్రముఖ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లవ్ కం రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. దీపావళి పండగ సందర్భంగా మరో మూడు యూత్ మూవీస్ తో తలపడుతున్న తెలుసు కదా ఇవాళ ట్రైలర్ రూపంలో తన అసలు కంటెంట్ బయట పెట్టింది.
వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ) యువతరం ప్రతినిధి. కాకపోతే మహా దూకుడు. అమ్మాయిల చేతికి మన జుట్టు వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదనుకునే రకం. డాక్టర్ రాగ (శ్రీనిధి శెట్టి) ని చూసి మనసు పారేసుకుని ప్రేమిస్తాడు. ఇంకోవైపు అంజలి (రాశి ఖన్నా) తో ప్రేమాయణం నడిపిస్తాడు. ఒక సందర్భంలో ఇద్దరినీ ఒకే చోటికి చేర్చే విచిత్రమైన పరిస్థితులు కొని తెచ్చుకుంటాడు. అందరూ కలిసి ఉన్నట్టే ఉంటుంది. ముగ్గురూ లవ్ చేసుకుంటారు. కానీ బయటికి చెప్పని ట్విస్టు ఏదో ఈ ట్రయాంగిల్ బంధానికి కారణం అయ్యుంటుంది. అదేంటో తెలియాలంటే అక్టోబర్ 17 దాకా వెయిట్ చేయాల్సిందే.
మాములుగా బాలీవుడ్ లో చూసే మాడరన్ ఏజ్ రిలేషన్ షిప్ ని దర్శకురాలు నీరజ కోన టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరోల కథలు శోభన్ బాబు కాలం నుంచే ఉన్నాయి కానీ తెలుసు కదాలో చాలా డిఫరెంట్ కోణాలు టచ్ చేసిన వైనం స్పష్టం. సిద్దు ఎప్పటిలాగే తన ఎనర్జీతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా వైవా హర్షను క్లాసు పీకుతూ చెప్పే డైలాగులు యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ట్రైలర్ చివరి షాట్ లో పెట్టిన బూతు డైలాగ్ కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే నిన్నటి దాకా అండర్ కరెంట్ గా ఉన్న తెలుసు కదా ఒక్కసారిగా వోల్టేజ్ పెంచేసుకుంది.
This post was last modified on October 13, 2025 3:13 pm
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…