మొన్న ఏప్రిల్ కే రావాల్సిన ది రాజా సాబ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా జనవరి 9 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్నా ఇంత లేట్ అవ్వడం వెనుక కారణం ఏమిటనే సందేహం అభిమానుల్లో విపరీతంగా ఉంది. దానికి నిర్మాత టిజి విశ్వప్రసాద్ గతంలో కొంత క్లారిటీ ఇవ్వగా తాజాగా ఇచ్చిన వేరొక ఇంటర్వ్యూలో ఇంకాస్త క్లియర్ పిక్చర్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా చేసిన వ్యక్తిని రాజా సాబ్ కోసం తీసుకున్నారు. భారీ పారితోషికాన్ని నెల నెల జీతం పద్ధతిలో ఇచ్చేందుకు ఆయన టీమ్ మొత్తానికి మాట్లాడుకున్నారు.
తీరా చూస్తే 2024 అక్టోబర్ దాకా ఒక్కటంటే ఒక్క షాట్ కి పని చేయలేదు. అదేమంటే బెదిరింపు ధోరణితో చేస్తే చేయించుకోండి లేదంటే వెళ్ళిపోతా అనే తరహాలో మాట్లాడ్డంతో దర్శకుడు మారుతీ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది. చూసి చూసి విసుగు చెందిన నిర్మాత ఇక లాభం లేదని విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ని తప్పించే నిర్ణయం తీసుకున్నారు. జీతం రూపంలో మంచినీళ్లలా డబ్బు ఖర్చవుతోంది తప్ప పని కావడం లేదని గుర్తించి వేరేవాళ్లను లైన్ లోకి తెచ్చుకున్నారు. ఇది జరిగిన కొంత టైంకే రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 నుంచి కూడా సదరు టెక్నీషియన్ ని పంపించేయడం విశ్వప్రసాద్ వర్షన్ కి మరింత బలం చేకూర్చింది.
నేరుగా పేరు చెప్పకపోయినా ఎవరి గురించి అన్నారో సగటు మూవీ లవర్స్ ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం. ట్రైలర్, టీజర్ చూశాక రాజా సాబ్ విజువల్ ఎఫెక్ట్స్ లో క్వాలిటీ కనిపించింది. ప్రభాస్ ఫ్యాన్స్ హమ్మయ్యా అనుకున్నారు. అసలే హారర్ డ్రామా. అందులోనూ నాలుగు వందల కోట్ల బడ్జెట్. తెరమీద నాణ్యత కనిపించకపోతే ట్రోలింగ్ బారిన పడాల్సి ఉంటుంది. దీని మీద శ్రద్ధ పెట్టడం వల్లే మిరాయ్ ఊహించనంత అద్భుత ఫలితం అందుకుంది. పరిమిత బడ్జెట్ లోనే అంత రాబట్టుకున్నప్పుడు మరి రాజా సాబ్ కు అంతకు పదింతలు ఎక్స్ పెక్ట్ చేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు.
This post was last modified on October 13, 2025 11:53 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…