ఇంకో అయిదు రోజుల్లో తెలుసు కదా విడుదల కానుంది. టిల్లు బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సినిమా అంటే మాములుగా ఓ రేంజ్ సందడి కనిపించాలి. కానీ టీమ్ మాత్రం రెగ్యులర్ ప్రమోషన్లకు పరిమితమయ్యింది. దర్శకురాలు నీరజ కోన ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. సిద్దు రవితేజతో కలిసి ఒక స్పెషల్ ముఖాముఖీ చేస్తే అందులో విషయాలు బాగానే బయటికి వెళ్తున్నాయి కానీ అసలు హైలైట్ అవ్వాల్సిన తెలుసు కదా కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడం లేదు. హీరోయిన్లు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తమవంతుగా ఏం చేయాలో అంతా చేస్తున్నారు. కానీ పబ్లిసిటీ పరంగా పోటీతో పోలిస్తే తెలుసు కదా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తోంది.
కొంచెం లోతుగా ఆలోచిస్తే సిద్ధూ సౌమ్యంగా ఉండడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న జాక్ తీవ్రంగా నిరాశపరిచింది. పైగా నిర్మాతకు నష్టం వస్తే తన పారితోషికంలో కొంత వెనక్కు ఇచ్చి మరీ సిద్ధూ తన బాధ్యతను నెరవేర్చాల్సి వచ్చింది. సో తెలుసు కదా విడుదలకు ముందు లౌడ్ ప్రమోషన్లతో హడావిడి చేయడం కన్నా టాక్, రివ్యూస్ ని మెప్పించగలమనే ధీమాతో తన రెగ్యులర్ స్టైల్ కి దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ట్రైలర్ కూడా ఆలస్యం చేశారు. తమన్ పాటలు రీచ్ అయినా వాటిని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకోలేదు. కానీ అవతల పండగ కాంపిటీషన్ అలా లేదు.
కె ర్యాంప్ టీమ్ ఇప్పటికే సరిపడా బజ్ తెచ్చేసుకుంది. కిరణ్ అబ్బవరం స్టేట్ మెంట్లు, ట్రైలర్, యూనిట్ చేస్తున్న వినూత్నమైన మార్కెటింగ్, ఎక్కువ మీడియా అండ్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం తదితరాలు హైప్ తెస్తున్నాయి. డ్యూడ్ డబ్బింగ్ మూవీ కావడంతో దాని వరకు ఎంత చేయాలో అంతా చేశాడు ప్రదీప్ రంగనాధన్. ఇక మిత్ర మండలి ముందు జాగ్రత్తగా ఎర్లీ ప్రీమియర్స్ కు వెళ్లే ఆలోచనలో ఉంది. ఓకే అయితే అక్టోబర్ 15 సాయంత్రం నుంచే షోలు ఉంటాయి. సో తెలుసు కదా ఇక మేజిక్ చేయాల్సింది ట్రైలర్ అండ్ కంటెంట్ తోనే. ఏదో షాకింగ్ పాయింట్ ఉందంటున్నారు, అది కనెక్ట్ అయితే సూపర్ హిట్టేనట.
ది రాజా సాబ్ తర్వాత దాన్ని మర్చిపోయే సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వాళ్ళు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…
రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…