ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటిగా అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రి విజువలైజేషన్ వీడియో చూసే అందరూ షాకైపోయారు. ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని అర్థమైంది. దీని గురించి ఎవ్వరు మాట్లాడినా ఆహా ఓహో అనే అంటున్నారు.
ఏకంగా 700-800 కోట్ల బడ్జెట్లో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీఎఫెక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ సహా పలు విభాగాల్లో పదుల సంఖ్యలో ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమా గురించి బయటి వాళ్లు మాట్లాడ్డమే తప్ప.. మెయిన్ కాస్ట్ అండ్ క్రూ ఎవ్వరూ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు స్వయంగా దర్శకుడు అట్లీ ఒక ఇంటర్వ్యూలో బన్నీతో తాను చేస్తున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనిది ఈ చిత్రంలో చూపించబోతున్నామని అతను ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. హాలీవుడ్లో కూడా రెఫరెన్సులు లేని స్థాయిలో ఈ సినిమా కొత్తగా ఉంటుందని అతను చెప్పాడు. ఈ సినిమా తీస్తూ రెఫర్ చేసుకోవడానికి తమ దగ్గర ఏ బైబిల్ లేదని.. అంతా కొత్తగా అనిపించిందని.. తాము నేర్చుకుంటూ సినిమా తీస్తున్నామని అతనన్నాడు.
ఈ చిత్రం అచ్చంగా హాలీవుడ్ సినిమాలాగే ఉంటుందని.. అక్కడి నిపుణులే బోలెడంతమంది ఈ సినిమాకు పని చేస్తున్నారని అట్లీ చెప్పాడు. ఆ టెక్నీషియన్లు సైతం తమకు ఈ సినిమా పెద్ద ఛాలెంజ్ అని చెప్పారని అట్లీ వెల్లడించాడు. ఈ సినిమా నుంచి ఏదైనా విశేషాన్ని ప్రేక్షకులకు చూపిద్దామా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని.. అందుకు ఇంకొన్ని నెలలు పడుతుందని అట్లీ చెప్పాడు. బన్నీ లుక్ కొత్తగా ఉంటుందట కదా, ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవల్ అట కదా అని అంటే.. కొన్ని నెలలు ఎదురు చూడండి, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతారు అంటూ ఊరించాడు అట్లీ.
This post was last modified on October 11, 2025 1:23 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…