ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని.. సోషల్ మీడియాలో కనిపించే ఫొటోలు, వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని అయోమయం నెలకొంది. ఏ కొత్త సాంకేతికత వచ్చినా దాన్ని చెడు మార్గంలో ఉపయోగించడానికి చూసే వాళ్లు చాలామందే ఉంటారు. ఏఐని కూడా అలా వాడుతున్న వాళ్లకు కొదవ లేదు. ముఖ్యంగా కుర్రాళ్లు హీరోయిన్ల ఫొటోలను మార్ఫ్ చేయడానికి ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ట్రెడిషనల్ హీరోయిన్గా ముద్ర భామ ప్రియాంక అరుల్ మోహన్ ఫొటోలను.. చాలా హాట్గా తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలేశారు. ఇటీవలే ‘ఓజీ’ సినిమాతో పలకరించింది ప్రియాంక. అందులో ఒక పాటలో కొంచెం సెక్సీగా కనిపించింది ప్రియాంక. కానీ ఆమె హద్దులేమీ దాటిపోలేదు.
కానీ స్నానం చేసి వచ్చి చీరను చుట్టుకున్న లుక్తో హీరోతో రొమాన్స్ చేసే చిన్న సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని.. ఆమె బిహైండ్ ద సెట్స్ లుక్స్ అంటూ ఆమె హాట్ ఫొటోలను సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. అవి ప్రియాంక స్వయంగా తీసుకున్న సెల్ఫీలంటూ ప్రచారం చేశారు. కెరీర్లో ఎన్నడూ హాట్ లుక్స్లో కనిపించని ప్రియాంక.. క్లీవేజ్ షో చేస్తూ సెల్ఫీలు దిగిందేంటా అని అందరూ ఆశ్చర్యపోయారు.
తన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రియాంక స్పందించింది. ఆ ఫొటోలు ఒరిజినల్ కాదని, ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ పిక్స్ అని ఆమె తేల్చేసింది. ఏఐని బాధ్యతాయుతంగా వాడాలని.. ఇలా ఫేక్ చేయడానికి కాదని.. వీటిని ఎవ్వరూ షేర్ చేయొద్దని ఆమె విన్నవించింది. వైరల్ అవుతున్న ఫొటోలను చూస్తే ఒరిజినల్ అని పొరబడే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇవి ఫేక్ అని ‘ఎక్స్’లో ‘గ్రోక్’ సైతం కన్ఫమ్ చేసింది. ఏఐని సరిగ్గా వాడకపోతే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇది ఉదాహరణ.
This post was last modified on October 11, 2025 12:43 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…