ఒక్కోసారి కొన్ని శుక్రవారాలు డ్రైగా అనిపిస్తే మరికొన్నేమో ఓవర్ కాంపిటేషన్ వల్ల ఏది చూడాలో అర్థం కాని అయోమయాన్ని సృష్టిస్తాయి. ఉదాహరణకు అక్టోబర్ 10 వస్తున్న సినిమాలన్నీ చిన్నవే. దేనికీ హైప్ లేదు. టాక్ వస్తే నిలబడతాయి. లేదంటే లేదు. ఆపై అక్టోబర్ 17 నుంచి 21 మధ్య ఏకంగా ఆరు చెప్పుకోదగ్గ రిలీజులున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, ప్రదీప్ రంగనాథన్, ధృవ్ విక్రమ్, రష్మిక మందన్న, ప్రియదర్శి ఇలా నువ్వా నేనానే రేంజ్ లో తలపడుతున్నారు. వీటిలో ఒకటో రెండో రేపు వచ్చి ఉంటే బాక్సాఫీస్ కు కొంచెం ఊపొచ్చేది. కథ ఇక్కడితో అయిపోలేదు. నవంబర్ లోనూ ఇది రిపీటవుతోంది.
వచ్చే నెల మొదటి వారంలో ట్రయాంగిల్ క్లాష్ జరగబోతోంది. మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ ‘వృషభ’ నవంబర్ 6 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించాడు. ఫాంటసీ, డివోషనల్ ఎలిమెంట్స్ తో రూపొందిన వృషభ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. విఎఫ్ఎక్స్ కు పెద్ద పీఠ వేశారు. సుధీర్ బాబు ‘జటాధర’ ఒకరోజు ఆలస్యంగా నవంబర్ 7 రానుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా మిరాయ్, కాంతార తరహాలో దైవానికి సంబంధించిన ఎలిమెంట్స్ తోనే రూపొందింది. బడ్జెట్ ఎక్కువే పెట్టారు.
వీటితో పాటు రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7నే రానుంది. చిలసౌ, మన్మథుడు 2 ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ లో ఎవటూ టచ్ చేయని పాయింట్ ఉంటుందని మేకర్స్ ఊరిస్తున్నారు. ఇక్కడ చెప్పిన మూడు సినిమాలకూ విపరీతమైన బజ్ లేదు. పబ్లిసిటీతో దాన్ని సృష్టించాలి. దానికి ప్రమోషన్లు కీలకం కాబోతున్నాయి. టాలీవుడ్ వరకు చూసుకుంటే ఇవి స్టార్స్ ఉన్న కంటెంట్స్ కాదు కాబట్టి మార్కెటింగ్ ద్వారానే ఓపెనింగ్స్ సాధించాలి. ఆపై తీర్పు ప్రేక్షకుల చేతిలో ఉండబోతోంది. మరి ఈ ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఇంకో నెల ఆగాల్సిందే.
This post was last modified on October 9, 2025 5:36 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…