బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ వీరవిహారం అఖండ 2 యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అదేంటి రెండు సంబంధం లేని సినిమాలు కదానే డౌట్ వస్తోందా, అక్కడికే వద్దాం. బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఈసారి దైవత్వానికి సంబంధించిన చాలా సీరియస్ అంశాలు బలంగా జొప్పించారట. ముఖ్యంగా అఘోరాల శక్తులు, హిమాలయాల్లో వాళ్ళ ప్రభావం, సాక్ష్యాత్తు శివుడే కొలువై ఉంటాడని చెప్పుకునే బద్రీనాథ్, కేదార్ నాథ్ లాంటి క్షేత్రాల రెఫరెన్సులతో పాటు పెద్ద బాలయ్యకు సంబంధించి పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారని టాక్.
విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి, బాలకృష్ణల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట. వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయపాటి శీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారని రషెస్ చూసినవాళ్ళ మాట. డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. ఇంటర్వెల్ తో మొదలుపెట్టి సెకండాఫ్ మొత్తం గూస్ బంప్స్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అఖండలో తొలిసగం తర్వాత నామమాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడీ సీక్వెల్ లో పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలిసింది.
డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న అఖండ 2 ప్రమోషన్లు దీపావళి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో మిగిలిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పబ్లిసిటీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలకు వచ్చిన ఆదరణని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉండేలా బోయపాటి శీను పక్కా స్క్రిప్ట్ రాసుకున్నారట. పోటీ ఉండే అవకాశం తక్కువగా ఉండటంతో డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ దాకా అఖండ 2 తాండవం ఓ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ టాక్ రావాలంతే.
This post was last modified on October 8, 2025 10:10 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…