బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ వీరవిహారం అఖండ 2 యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అదేంటి రెండు సంబంధం లేని సినిమాలు కదానే డౌట్ వస్తోందా, అక్కడికే వద్దాం. బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఈసారి దైవత్వానికి సంబంధించిన చాలా సీరియస్ అంశాలు బలంగా జొప్పించారట. ముఖ్యంగా అఘోరాల శక్తులు, హిమాలయాల్లో వాళ్ళ ప్రభావం, సాక్ష్యాత్తు శివుడే కొలువై ఉంటాడని చెప్పుకునే బద్రీనాథ్, కేదార్ నాథ్ లాంటి క్షేత్రాల రెఫరెన్సులతో పాటు పెద్ద బాలయ్యకు సంబంధించి పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారని టాక్.
విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి, బాలకృష్ణల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట. వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయపాటి శీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారని రషెస్ చూసినవాళ్ళ మాట. డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. ఇంటర్వెల్ తో మొదలుపెట్టి సెకండాఫ్ మొత్తం గూస్ బంప్స్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అఖండలో తొలిసగం తర్వాత నామమాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడీ సీక్వెల్ లో పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలిసింది.
డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న అఖండ 2 ప్రమోషన్లు దీపావళి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో మిగిలిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పబ్లిసిటీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలకు వచ్చిన ఆదరణని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉండేలా బోయపాటి శీను పక్కా స్క్రిప్ట్ రాసుకున్నారట. పోటీ ఉండే అవకాశం తక్కువగా ఉండటంతో డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ దాకా అఖండ 2 తాండవం ఓ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ టాక్ రావాలంతే.
This post was last modified on October 8, 2025 10:10 pm
ఏపీలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బరి సాగు ఎక్కువ. దేశంలో కేరళ తర్వాత.. కోనసీమలో భారీ ఎత్తున కొబ్బరి సాగు చేస్తున్నారు.…
సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…
ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…
టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి…
2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న…