బాక్సాఫీస్ వద్ద కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ వీరవిహారం అఖండ 2 యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. అదేంటి రెండు సంబంధం లేని సినిమాలు కదానే డౌట్ వస్తోందా, అక్కడికే వద్దాం. బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డివోషనల్ యాక్షన్ డ్రామాలో ఈసారి దైవత్వానికి సంబంధించిన చాలా సీరియస్ అంశాలు బలంగా జొప్పించారట. ముఖ్యంగా అఘోరాల శక్తులు, హిమాలయాల్లో వాళ్ళ ప్రభావం, సాక్ష్యాత్తు శివుడే కొలువై ఉంటాడని చెప్పుకునే బద్రీనాథ్, కేదార్ నాథ్ లాంటి క్షేత్రాల రెఫరెన్సులతో పాటు పెద్ద బాలయ్యకు సంబంధించి పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారని టాక్.
విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టి, బాలకృష్ణల మధ్య జరిగే పోరాట సన్నివేశాలు నెవర్ బిఫోర్ అనే తరహాలో డిజైన్ చేశారట. వీటి విఎఫ్ఎక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బోయపాటి శీను క్వాలిటీ విషయంలో బెస్ట్ ఇచ్చారని రషెస్ చూసినవాళ్ళ మాట. డబ్బింగ్ సమయంలో చూసిన ఇతర ఆర్టిస్టులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. ఇంటర్వెల్ తో మొదలుపెట్టి సెకండాఫ్ మొత్తం గూస్ బంప్స్ కంటెంట్ ఉంటుందని ఊరిస్తున్నారు. అఖండలో తొలిసగం తర్వాత నామమాత్రంగా మారిన రెండో బాలయ్య క్యారెక్టర్ ఇప్పుడీ సీక్వెల్ లో పొలిటికల్ టచ్ తో కొత్త తరహాలో ఉంటుందని తెలిసింది.
డిసెంబర్ 5 విడుదలకు రెడీ అవుతున్న అఖండ 2 ప్రమోషన్లు దీపావళి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో మిగిలిన పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈసారి నార్త్ ఇండియా మీద ప్రత్యేక దృష్టి పెట్టి పబ్లిసిటీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కాంతార, కార్తికేయ 2 లాంటి సినిమాలకు వచ్చిన ఆదరణని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉండేలా బోయపాటి శీను పక్కా స్క్రిప్ట్ రాసుకున్నారట. పోటీ ఉండే అవకాశం తక్కువగా ఉండటంతో డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ దాకా అఖండ 2 తాండవం ఓ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ టాక్ రావాలంతే.
This post was last modified on October 8, 2025 10:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…