సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి వారణాసి టైటిల్ అనుకున్నట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. నిజానికి జక్కన్న ఇంకా ఏ పేరుని లాక్ చేయలేదట. ముందు మహారాజ్ అన్నారు. తర్వాత జెన్ 63 అంటూ కొత్త పేరు బయటికి వచ్చింది. ఇప్పుడీ లిస్టులో వారణాసిని చేర్చారు. ఇన్ సైడ్ టాక్ అయితే కథకు సంబంధించి కాశి కీలక పాత్ర పోషిస్తుంది అని ఆ ప్రాంతం పేరునే పెట్టే ఆలోచన రాజమౌళి చేస్తున్నారట. కానీ ఇంకా ఫైనల్ కాలేదని వినికిడి. ఆర్ఆర్ఆర్ టైంలో ఇలాంటి సందిగ్ధం చవి చూసిన ఆయన చివరికి వర్కింగ్ కోసం పెట్టుకున్న ట్రిపులార్ నే ఖాయం చేసుకున్నారు.
వచ్చే నెల నవంబర్ లో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అఫీషియల్ లాంచ్ జరగనుంది. రాజమౌళి మీడియా ముందుకు వచ్చి అన్నీ వివరించబోతున్నారు. కాన్సెప్ట్ ని రివీల్ చేసే వీడియో టీజర్ ఉండొచ్చని అంతర్గత సమాచారం. దాంట్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ విజువల్స్ ఉంటాయా లేక ఏదైనా యానిమేషన్ తో సరిపుచ్చుతారా అనేది వేచి చూడాలి. రెండోది జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ టైటిల్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోతే ఇప్పుడప్పుడే రాజమౌళి దాన్ని లాక్ చేయకపోవచ్చు. ఇప్పటిదాకా వచ్చినా వాటిలో జెన్ 63కే గ్లోబల్ అప్పీల్ ఉందనేది వాస్తవం.
సో ఈ సస్పెన్స్ ఇంకొద్ది రోజులు ఇలాగే కొనసాగనుంది. 2027 మార్చి విడుదలను లక్ష్యంగా చేసుకున్న ఎస్ఎస్ఎంబి 29 షూట్ ని వచ్చే వేసవికల్లా పూర్తి చేయాలనేది రాజమౌళి లక్ష్యం. ఆపై పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అసలే ఈసారి అన్ని దేశాల్లో సమాంతరంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్న జక్కన్న ఫారిన్ కొలాబరేషన్స్ చాలానే మాట్లాడుకున్నారట. ఆ వివరాలన్నీ వచ్చే నెల తెలియబోతున్నాయి. కీరవాణి ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తి చేశారని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియాల్సి ఉంది. ఈవెంట్ హైదరాబాద్ లో జరిగే అవకాశాలెక్కువగా ఉన్నాయి.
This post was last modified on October 8, 2025 9:28 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…