గత ఏడాది ‘క’తో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి కె ర్యాంప్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సంవత్సరం దిల్ రుబా షాక్ ఇచ్చినప్పటికీ తిరిగి కంబ్యాక్ అవుతాననే నమ్మకంతో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ మార్చుకుని, కేరళలో చదువుకునే తెలుగు స్టూడెంట్ గా ఊర మాస్ క్యారెక్టరైజేషన్ చేశాడు. ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. టీజర్, ట్రైలర్ లో వినిపించిన డబుల్ మీనింగ్ డైలాగుల గురించి సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపించాయి కానీ సినిమా చూశాక వాటి గురించి కంక్లూజన్ కు రమ్మంటున్నాడు. సరే ఇక అసలు విషయానికి వద్దాం.
కిరణ్ అబ్బవరం మన సినిమాలు పక్కరాష్ట్రంలో సరిగ్గా ఆడకపోవడం గురించి ఒక లాజికల్ ప్రశ్న అడుగుతున్నాడు. ప్రదీప్ రంగనాధన్ లాంటి తమిళ హీరోకు తెలుగు రాష్ట్రాల్లో సరిపడా థియేటర్లు దొరుకుతున్నాయి. కానీ అదే తరహాలో తన సినిమాని తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు లేవని, ఇవ్వమని చెబుతున్నారట. అంటే మనం ఇంత ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు కూడా కాస్త అభిమానం ప్రదర్శించాలి కదానేది కిరణ్ క్వశ్చన్. ఇది నిజంగా ఆవేదన కలిగించేదే. పైగా ఈ సమస్య అతనొక్కడిదే కాదు. పెద్ద ఇమేజ్ ఉన్న టయర్ 2 టాలీవుడ్ స్టార్లు సైతం ఈ ఇబ్బందిని ఎదురుకున్నారు.
దీనికి కారణం ఒకటే. మనం తమిళ డబ్బింగ్ సినిమాలు ఎగబడి కొని చూసినంతగా మనవి వాళ్ళు చూడరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఆఖరికి తమిళ టైటిల్స్ యధాతథంగా అక్షరం మార్చకుండా, అర్థం కాకుండా పెట్టినా సరే ఇదేంటని అడగకుండా పెద్ద మనసుతో చూసేస్తాం. ఎవరైనా అడిగితే ప్యాన్ ఇండియా మూవీస్ కి ఒకటే పేరు ఉండాలని విచిత్ర సమర్ధింపు హక్కులు కొన్న నిర్మాత నుంచి వినిపిస్తుంది. కిరణ్ చెప్పాడని కాదు, ఇదే ప్రాబ్లమ్ గతంలో చిరంజీవి సైతం ఫేస్ చేశాడని కాదు. ముందు ఏదో ఒక పరిష్కారం దొరికేలా మన టాలీవుడ్ పెద్దలు నడుం బిగించాలి. అప్పుడే తెలుగు సినిమాలు తమిళంలోనూ మంచి రిలీజ్ దక్కించుకుంటాయి.
This post was last modified on October 8, 2025 3:41 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…