‘కొత్త బంగారు లోకం’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. రెండో చిత్రం ‘ముకుంద’ నిరాశపరిచినా.. మూడో సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో హిట్ అందుకున్నాడు శ్రీకాంత్. మహేష్ బాబు, వెంకటేష్ లాంటి టాప్ హీరోల కలయికలో మంచి సినిమా తీ తీసి.. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకునేలా చేశాడు. ఆ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్లిన శ్రీకాంత్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంతా అనుకున్నారు.
కానీ ‘బ్రహ్మోత్సవం’తో అంతా మారిపోయింది. అది టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో శ్రీకాంత్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ నుంచి అంతర్ధానం అయిపోయాడు. తిరిగి రీమేక్ మూవీ ‘నారప్ప’ చేసినా.. అది పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. ఆపై ‘పెదకాపు’ సినిమా తీస్తే పెద్ద డిజాస్టర్ అయి అడ్డాల కెరీర్కు పెద్ద బ్రేక్ పడిపోయింది. మళ్లీ ఇంకో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు.
‘కూచిపూడి వారి వీధి’ పేరుతో ఒక స్క్రిప్టు రాసి.. ముందు రానా దగ్గుబాటిని ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. ఆపై కిరణ్ అబ్బవరం దగ్గరికి ఈ కథ వెళ్లింది. అతను సానుకూలంగానే స్పందించాడు. యువ నిర్మాత ధీరజ్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ ముగ్గురూ కలిసి కొంత కాలం ట్రావెల్ చేశారు. కానీ ఇప్పుడు నిర్మాత వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఎక్కువ కావడంతో.. అంత ఖర్చుతో సినిమా తీసి వర్కవుట్ చేయడం కష్టమని నిర్మాత వెనక్కి తగ్గాడట.
కిరణ్కు సైతం వేరే కమిట్మెంట్లు ఉండడంతో వెంటనే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లే స్థితిలో కనిపించడం లేదు. అతను ‘చెన్నై లవ్ స్టోరీ’లో నటిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ శిష్యుడు వీరా కోగటం దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది కాక సొంత బేనర్లో ఓ డెబ్యూ డైరెక్టర్తో ఒక సినిమాకు కమిటయ్యాడు. వీటి సంగతి చూశాకే అడ్డాల సినిమా గురించి ఆలోచించాలని కిరణ్ ఫిక్సవడంతో అడ్డాల సినిమా ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశం లేదని తెలుస్తోంది.
This post was last modified on October 7, 2025 9:19 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…