ఓ యువ హీరోతో పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ ఎప్పటిలా నాలుగైదు నెలలలో షూటింగ్ పూర్తి చేద్దామని చూసాడు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల అప్పట్నుంచీ ఆ సినిమా షూటింగ్ జరగలేదు. మిగతా సినిమాలన్నీ మొదలవుతున్నా కానీ పూరి జగన్నాథ్ సినిమా మాత్రం ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.
పూరి నిర్మాత అయితే ఇన్ని రోజులు ఖాళీగా వుండేవాడే కాదు. కానీ ఈ చిత్రానికి ఫండింగ్ కరణ్ జోహార్ ఇస్తున్నాడు. అతడికి ఎప్పుడూ చాలా సినిమాలు లైన్లో వుంటాయి. ప్రయారిటీ బేసిస్ మీద సినిమాలు పూర్తి చేస్తాడు. ఈ చిత్రానికి ఇంకా చాలా భాగం షూటింగ్ వుంది కనుక ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాల్సిన పని లేదని అలా పక్కన వుంచాడు. దీంతో పూరి జగన్నాథ్ మరో సినిమా మొదలు పెట్టుకోలేక అలా వేచి చూస్తున్నాడు.
హిందీలో షూటింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. ముంబయిలో కరోనా భయం తీవ్రంగా వుండడంతో బాలీవుడ్ తారలు ఇంకా ఇళ్లు దాటడం లేదు. పూర్తయ్యే దశలో వున్న చిత్రాలను మాత్రం ఎలాగోలా కంప్లీట్ చేసి ఓటిటికి ఇచ్చేస్తున్నారు. ఓ రకంగా పూరి జగన్నాథ్ లక్కీ అనుకోవాలి. అతని సినిమా పూర్తయి వుంటే కనుక కరణ్ ఈపాటికే ఓటిటి డీల్ చేసేసుకునేవాడు.
This post was last modified on November 27, 2020 2:19 pm
నిన్నా మొన్నటి వరకు భోగాపురం పేరు వినగానే అల్లూరి సీతారామరాజు విమానాశ్రయమే గుర్తుకు వచ్చేది. రెండు రోజులుగా భోగాపురం పేరు…
ఒక వెబ్ సిరీస్ సినిమాగా మారిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందానే అనుమానం మిర్జాపూర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు అందరికీ కలిగింది.…
సంవత్సరాల తరబడి నందమూరి అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన మోక్షజ్ఞ తెరంగేట్రం ఫిక్స్ అయిపోయింది. బింబిసార, విశ్వంభర ఫేమ్ వశిష్ఠ…
తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ భాషా భేదం లేదు. కంటెంట్ బాగుంటే చాలు కన్నడ, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ అనే తేడాలు…
గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…
వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…