ఓ యువ హీరోతో పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ ఎప్పటిలా నాలుగైదు నెలలలో షూటింగ్ పూర్తి చేద్దామని చూసాడు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల అప్పట్నుంచీ ఆ సినిమా షూటింగ్ జరగలేదు. మిగతా సినిమాలన్నీ మొదలవుతున్నా కానీ పూరి జగన్నాథ్ సినిమా మాత్రం ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.
పూరి నిర్మాత అయితే ఇన్ని రోజులు ఖాళీగా వుండేవాడే కాదు. కానీ ఈ చిత్రానికి ఫండింగ్ కరణ్ జోహార్ ఇస్తున్నాడు. అతడికి ఎప్పుడూ చాలా సినిమాలు లైన్లో వుంటాయి. ప్రయారిటీ బేసిస్ మీద సినిమాలు పూర్తి చేస్తాడు. ఈ చిత్రానికి ఇంకా చాలా భాగం షూటింగ్ వుంది కనుక ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాల్సిన పని లేదని అలా పక్కన వుంచాడు. దీంతో పూరి జగన్నాథ్ మరో సినిమా మొదలు పెట్టుకోలేక అలా వేచి చూస్తున్నాడు.
హిందీలో షూటింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. ముంబయిలో కరోనా భయం తీవ్రంగా వుండడంతో బాలీవుడ్ తారలు ఇంకా ఇళ్లు దాటడం లేదు. పూర్తయ్యే దశలో వున్న చిత్రాలను మాత్రం ఎలాగోలా కంప్లీట్ చేసి ఓటిటికి ఇచ్చేస్తున్నారు. ఓ రకంగా పూరి జగన్నాథ్ లక్కీ అనుకోవాలి. అతని సినిమా పూర్తయి వుంటే కనుక కరణ్ ఈపాటికే ఓటిటి డీల్ చేసేసుకునేవాడు.
This post was last modified on November 27, 2020 2:19 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…