ఓ యువ హీరోతో పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ ఎప్పటిలా నాలుగైదు నెలలలో షూటింగ్ పూర్తి చేద్దామని చూసాడు. కానీ కరోనా లాక్డౌన్ వల్ల అప్పట్నుంచీ ఆ సినిమా షూటింగ్ జరగలేదు. మిగతా సినిమాలన్నీ మొదలవుతున్నా కానీ పూరి జగన్నాథ్ సినిమా మాత్రం ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.
పూరి నిర్మాత అయితే ఇన్ని రోజులు ఖాళీగా వుండేవాడే కాదు. కానీ ఈ చిత్రానికి ఫండింగ్ కరణ్ జోహార్ ఇస్తున్నాడు. అతడికి ఎప్పుడూ చాలా సినిమాలు లైన్లో వుంటాయి. ప్రయారిటీ బేసిస్ మీద సినిమాలు పూర్తి చేస్తాడు. ఈ చిత్రానికి ఇంకా చాలా భాగం షూటింగ్ వుంది కనుక ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాల్సిన పని లేదని అలా పక్కన వుంచాడు. దీంతో పూరి జగన్నాథ్ మరో సినిమా మొదలు పెట్టుకోలేక అలా వేచి చూస్తున్నాడు.
హిందీలో షూటింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. ముంబయిలో కరోనా భయం తీవ్రంగా వుండడంతో బాలీవుడ్ తారలు ఇంకా ఇళ్లు దాటడం లేదు. పూర్తయ్యే దశలో వున్న చిత్రాలను మాత్రం ఎలాగోలా కంప్లీట్ చేసి ఓటిటికి ఇచ్చేస్తున్నారు. ఓ రకంగా పూరి జగన్నాథ్ లక్కీ అనుకోవాలి. అతని సినిమా పూర్తయి వుంటే కనుక కరణ్ ఈపాటికే ఓటిటి డీల్ చేసేసుకునేవాడు.
This post was last modified on November 27, 2020 2:19 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…