సరిలేరు నీకెవ్వరు అనే పదం రాజమౌళికి అతికినట్టు సరిపోతుంది. మాములుగా రీ రిలీజ్ సినిమా అంటే సదరు దర్శక నిర్మాతలు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాని కబుర్లు పంచుకుని అక్కడితో మమ అనిపిస్తారు. మహా అయితే ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. అలా చేస్తే జక్కన్నకు మిగిలిన వాళ్లకు తేడా ఏముంటుంది. అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ కోసం రాజమౌళి టీమ్ పడుతున్న కష్టం, పర్ఫెక్షన్ కోసం తపిస్తున్న విధానం మాములుగా లేవు. నెట్ ఫ్లిక్స్ లో బాహుబలి బిగినింగ్, కంక్లూజన్ హిందీ ఇంగ్లీష్ వెర్షన్లు తీసేయడం ద్వారా ఆడియన్స్ కో స్వీట్ షాక్ ఇచ్చారు. తెలుగు అయితే ప్రస్తుతానికి హాట్ స్టార్లో అందుబాటులో ఉన్నాయి.
ఐమాక్స్ తో పాటు వివిధ ఫార్మాట్లలో విడుదలవుతున్న బాహుబలి ఎపిక్ కోసం ఎడిటింగ్ రూమ్ లో అన్నీ దగ్గరుండి చూసుకుంటున్న రాజమౌళి స్క్రీన్ యాస్ పెక్ట్ రేషియోతో మొదలుపెట్టి కలర్ గ్రేడింగ్ దాకా ప్రతిదీ తన పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంటున్నారు. ఆల్రెడీ క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తో కొన్ని ఇంటర్వ్యూలు షూట్ చేశారు. ఘాటీ ప్రమోషన్లకు బయటికి రాని అనుష్క ఇప్పుడీ బాహుబలి ఎపిక్ కోసం కెమెరా ముందుకొచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇది కూడా ఒక రకమైన మినీ సెన్సేషన్. ప్రభాస్, రానా, సత్యరాజ్, రామకృష్ణ తదితరుల ప్రోగ్రాంస్ తో పాటు మేకింగ్ వీడియోస్ వదలబోతున్నారు.
ఇంత శ్రద్ధగా రీ రిలీజ్ చేయడం వెనుక రాజమౌళి లక్ష్యం ఒక్కటే. బాహుబలి ది ఎపిక్ ని ఒక స్టాండ్ అలోన్ మూవీగా కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయడమే. రెండు భాగాలు కొన్ని వందలసార్లు చూసిన అభిమానులు సైతం ఫ్రెష్ గా ఫీలయ్యేలా కొత్త వెర్షన్ వచ్చిందట. మూడున్నర గంటల నిడివి లాక్ చేసినట్టు తెలిసింది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కోసం రెడీ అవుతున్నారు. కల్కి 2898 ఏడి వచ్చి ఏడాది దాటేసింది. కన్నప్పలో క్యామియో కావడంతో లైట్ తీసుకున్నారు. రాజా సాబ్ రావడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది. సో బాహుబలి థియేటర్లలో సంబరాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి.
This post was last modified on October 4, 2025 3:19 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…