‘అర్జున్ రెడ్డి’తో మంచి పేరు సంపాదించి టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకడిగా ఎదిగిన రాహుల్ రామకృష్ణ.. ఎక్స్లో చాలా యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడూ సామాజిక, రాజకీయ అంశాల మీద అప్పుడప్పుడూ హాట్ హాట్ పోస్టులు పెడుతుంటాడు. అందులో కొన్ని తీవ్ర వివాదం రేపుతుంటాయి కూడా. ఇప్పుడు అలాంటి ట్వీట్లతోనే రాహుల్ రామకృష్ణ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.
తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఘాటు విమర్శలు చేస్తూ.. మళ్లీ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేసీఆర్ రావాలి అంటూ అతను పోస్టు పెట్టడం పెద్ద దుమారమే రేపింది. రాజకీయాల్లో లేని ఒక నటుడు ఇలాంటి పోస్ట్ పెట్టడం అరుదైన విషయమే. దీంతో పాటుగా గాంధీ జయంతి రోజు గాంధీకి వ్యతిరేకంగా కూడా అతనో పోస్టు పెట్టాడు. అది కూడా తీవ్ర వివాదాస్పదం అయింది. ఐతే కొన్ని గంటల్లోనే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోవడం గమనార్హం.
ముందుగా ‘‘హైదరాబాద్ మునిగిపోయింది. మీ హామీలన్నీ విఫలమయ్యాయి. అన్నీ చక్కదిద్దడం కోసం జనాలు కేసీఆర్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు’’ అని ఒక పోస్టు పెట్టాడు. తర్వాత ‘‘మనం దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం’’ అని మరో పోస్టు పెట్టి.. ‘‘నన్ను చంపేస్తారా చంపేయండి. జరుగుతున్న పరిణామాలతో అలసిపోయాను’’ అని కామెంట్ జోడించాడు రాహుల్.
మరోవైపు గాంధీజయంతి సందర్భంగా గాంధీ గురించి మాట్లాడుతూ.. ఆయన సాధువు కాదని, మహాత్ముడు కాదని నొక్కి వక్కాణించాడు రాహుల్. ఈ పోస్టులు తీవ్ర దుమారానికి దారి తీశాయి. కాంగ్రెస్ వాళ్లు, గాంధీ అభిమానులు రాహుల్పై విరుచుకుపడ్డారు. కొన్ని గంటల్లో రాహుల్ ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది. తన అకౌంటును ఎవరో హ్యాక్ చేశారంటూ రాహుల్ చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వాళ్లు అతణ్ని బెదిరించి అకౌంట్ డీయాక్టివేట్ చేసుకునేలా చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో తెలియాల్సి ఉంది.
This post was last modified on October 3, 2025 3:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…