పవన్ కళ్యాణ్ ఓజితో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఫైనల్ స్టేటస్ తేలడానికి టైం పడుతుంది కానీ హరిహర వీరమల్లు చేసిన గాయమైతే మానిపోయింది. ఎన్నడూ లేనిది పవన్ తాను ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిననే సంగతి మర్చిపోయి మరీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాలు పంచుకున్నారు. సినిమాల పరంగా ఆయన ఇంత ఆనందంగా ఉండటం ఈ మధ్యకాలంలో చూడలేదని సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ ఓజి కనక ఫ్లాప్ అయ్యుంటే ఇక మేకప్ కి దూరంగా ఉండేవారేమో కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వాళ్ళ మాట. ఇక నెక్స్ట్ అందరి చూపు ఉస్తాద్ మీద వెళ్తోంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓజి పుణ్యమాని ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అప్పుడే బిజినెస్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట. ఇంకా విడుదల కన్ఫర్మ్ చేయకపోయినా అడ్వాన్సులు ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడప్పుడే తొందరపడే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రాపర్ ప్రమోషన్లు ఇంకా మొదలుపెట్టలేదు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ పార్ట్ పూర్తి చేసినప్పటికీ మిగిలిన ప్యాచ్ వర్కులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాలి. డిసెంబర్ లోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని సమాచారం.
ఓజి రూపంలో పవన్ స్టామినా ఏంటో బయట పడింది కాబట్టి అది ఉస్తాద్ భగత్ సింగ్ కు ఖచ్చితంగా ఉపయోపడుతుంది. కాకపోతే ఓజి స్థాయిలో దీని మీద బజ్ లేదు. దాన్ని కొత్తగా క్రియేట్ చేయాలి. తేరి రీమేకనే ప్రచారంలో మొదట్లో ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా మర్చిపోయేలా పబ్లిసిటీ జరగాలి. దానికి హరీష్ శంకర్ దగ్గర ఒక ప్లాన్ ఉందట. అమలు చేయాలంటే ముందు విడుదల తేదీ లాక్ చేసుకోవాలి. 2026 మార్చి చివర్లో పెద్ది ఉంది కాబట్టి ఆ స్లాట్ మినహాయించి విశ్వంభరతో క్లాష్ రాకుండా ఏదైనా మంచి డేట్ కోసం టీమ్ చర్చలు జరుగుతోంది. బహుశా దీపావళిలోగా ఒక కంక్లూజన్ వస్తే పోస్టర్ లేదా టీజర్ వదులుతారు.
This post was last modified on October 3, 2025 12:30 pm
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…