ఎడిటింగ్ లో తీసేసిన ఓజి ఐటెం సాంగ్ ని ఇటీవలే జోడించిన సంగతి తెలిసిందే. నేహా శెట్టి మీద బ్యాంకాక్ లో షూట్ చేసిన ఈ ప్రత్యేక గీతం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రీ క్లైమాక్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గాయపడితే ఇమ్రాన్ హష్మీ వచ్చే టైంలో దర్శకుడు సుజిత్ దీనికి ప్లేస్ మెంట్ ఇచ్చాడు. అయితే సీరియస్ గా జరుగుతున్న నెరేషన్ లో ఇది అడ్డం వస్తుందని భావించి ఫస్ట్ వెర్షన్ లో తీసేశారు. డీజే టిల్లు భామ ఆడిపాడినా ఎందుకు ఇంపాక్ట్ లేదంటే అందులో పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం లాంటివేవీ లేవు కాబట్టి. తమన్ కూడా మిగిలిన సాంగ్స్ రేంజ్ లో దీన్ని కంపోజ్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏతావాతా చెప్పేదేంటంటే నేహా శెట్టి పాట వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదు. అందుకే తను కూడా ఒకచోట తప్ప ఎక్కడా ఓజి గురించి చెప్పడం కానీ, పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకున్నందుకు ఎగ్ జైట్మెంట్ చూపించడం కానీ ఏమి చేయలేదు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఫ్లోకు అడ్డం వస్తాయని తీసేసిన పాటల వల్ల అమాంతం కలెక్షన్లు పెరగడం లాంటివి ఉండవు. దేవర, మిరాయ్ ఎంత పెద్ద హిట్టయినా తర్వాత యాడ్ చేసిన సాంగ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందలేకపోయాయి. ఒరిజినల్ గా లాక్ చేసిన వర్షన్లే బాగున్నాయని ఆడియన్స్ అనుకునేలా చేశాయి.
సుహాస్ సీన్ తీసేయడం, అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కాస్త ట్రిమ్ చేయడం లాంటివి కూడా కొంచెం మైనస్ అయ్యాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సరే ఏదైతేనేం నేహా శెట్టిది బోనస్ గా ఫీలవ్వడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే మొదటిసారి ఓజి చూస్తున్న వాళ్లకు మాత్రం ఇదో స్పీడ్ బ్రేకర్ లా అనిపించడమే సమస్య. గతంలో గాడ్ ఫాదర్ లో కూడా ఇలాగే సందర్భం లేకుండా పెట్టిన పాట సినిమాలో ఉన్న సీరియస్ ఫీల్ తగ్గించేసింది. ఏదో మాస్ కోసమని బలవంతంగా చేసే ఇలాంటి ప్రయత్నాలు మిస్ ఫైర్ అవుతున్న దాఖలాలు ఎక్కువ. పుష్ప లాంటివి మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 2, 2025 4:46 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…