ఎడిటింగ్ లో తీసేసిన ఓజి ఐటెం సాంగ్ ని ఇటీవలే జోడించిన సంగతి తెలిసిందే. నేహా శెట్టి మీద బ్యాంకాక్ లో షూట్ చేసిన ఈ ప్రత్యేక గీతం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రీ క్లైమాక్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గాయపడితే ఇమ్రాన్ హష్మీ వచ్చే టైంలో దర్శకుడు సుజిత్ దీనికి ప్లేస్ మెంట్ ఇచ్చాడు. అయితే సీరియస్ గా జరుగుతున్న నెరేషన్ లో ఇది అడ్డం వస్తుందని భావించి ఫస్ట్ వెర్షన్ లో తీసేశారు. డీజే టిల్లు భామ ఆడిపాడినా ఎందుకు ఇంపాక్ట్ లేదంటే అందులో పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం లాంటివేవీ లేవు కాబట్టి. తమన్ కూడా మిగిలిన సాంగ్స్ రేంజ్ లో దీన్ని కంపోజ్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏతావాతా చెప్పేదేంటంటే నేహా శెట్టి పాట వల్ల కలిగిన ప్రయోజనం పెద్దగా లేదు. అందుకే తను కూడా ఒకచోట తప్ప ఎక్కడా ఓజి గురించి చెప్పడం కానీ, పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకున్నందుకు ఎగ్ జైట్మెంట్ చూపించడం కానీ ఏమి చేయలేదు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఫ్లోకు అడ్డం వస్తాయని తీసేసిన పాటల వల్ల అమాంతం కలెక్షన్లు పెరగడం లాంటివి ఉండవు. దేవర, మిరాయ్ ఎంత పెద్ద హిట్టయినా తర్వాత యాడ్ చేసిన సాంగ్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందలేకపోయాయి. ఒరిజినల్ గా లాక్ చేసిన వర్షన్లే బాగున్నాయని ఆడియన్స్ అనుకునేలా చేశాయి.
సుహాస్ సీన్ తీసేయడం, అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కాస్త ట్రిమ్ చేయడం లాంటివి కూడా కొంచెం మైనస్ అయ్యాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సరే ఏదైతేనేం నేహా శెట్టిది బోనస్ గా ఫీలవ్వడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే మొదటిసారి ఓజి చూస్తున్న వాళ్లకు మాత్రం ఇదో స్పీడ్ బ్రేకర్ లా అనిపించడమే సమస్య. గతంలో గాడ్ ఫాదర్ లో కూడా ఇలాగే సందర్భం లేకుండా పెట్టిన పాట సినిమాలో ఉన్న సీరియస్ ఫీల్ తగ్గించేసింది. ఏదో మాస్ కోసమని బలవంతంగా చేసే ఇలాంటి ప్రయత్నాలు మిస్ ఫైర్ అవుతున్న దాఖలాలు ఎక్కువ. పుష్ప లాంటివి మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
This post was last modified on October 2, 2025 4:46 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…