తెలుగు సినీ పరిశ్రమకు అతిపెద్ద ముప్పుగా నిలుస్తున్న పైరసీ వెబ్సైట్లలో ఐబొమ్మ పేరు ముందుంటుంది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతున్నాయి. దీని వలన నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ ఐబొమ్మ వెనుక ఉన్న వారిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో సాధారణ ప్రజల మనసులో సహజంగానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఈ బూతాన్ని ఎప్పుడు ఆపగలరు? అసలు వారిని పట్టుకోవడం ఎందుకంత కష్టం? అనే సందేహం రాకుండా ఉండదు.
గతంలో ఇలాంటి అనేక పైరసీ వెబ్సైట్లపై పోలీసు దాడులు జరిగాయి. ‘తమిళ్ రాకర్స్’, ‘మూవీస్డా’, ‘జాలీ మూవీ’ వంటి సైట్లు మూసివేసినా, కొద్ది రోజుల్లోనే వేరే పేర్లతో తిరిగి వచ్చేశాయి. అదే పరిస్థితి ఇప్పుడు ఐబొమ్మతోనూ కనిపిస్తోంది. ఒకసారి బ్లాక్ చేసినా, వెంటనే కొత్త డొమైన్లో మళ్లీ ప్రారంభమవుతోంది. అంతర్జాలంలో వందలాది డొమైన్లు ఉండటం, సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.
సైబర్ నిపుణుల వివరణ ప్రకారం, ఇలాంటి సైట్లు ఎక్కువగా అనామక సర్వర్లను ఉపయోగిస్తాయి. సాధారణంగా వీటి ఆపరేటర్లు VPNలు, ప్రాక్సీలు ఉపయోగించి తమ ఐపీలను దాచేస్తారు. మరోవైపు, బిట్కాయిన్ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రకటనల ఆదాయం పొందుతున్నారు. అందువల్ల వారిని ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా, వీరి ప్రధాన కేంద్రాలు భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉండటం వల్ల చట్టపరమైన అడ్డంకులు వస్తాయి.
అయితే పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేతులు ఎత్తేసినట్లు కనిపించడం లేదు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, ఐటీ చట్టాల కింద ఈ రాకెట్ను ఛేదించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే, ఒక వెబ్సైట్ను మూసేసినా, వెంటనే మరో కొత్త డొమైన్ తెరుచుకోవడం. దీంతో పూర్తి స్థాయిలో పైరసీని అదుపులోకి తెచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లను మూసివేయడం ఒక్క పోలీసులతో సాధ్యం కాదు. దీనికి ప్రభుత్వాల మధ్య సహకారం, కఠిన చట్టాలు, టెక్నాలజీ సహాయం అవసరం. ప్రజలు కూడా ఇలాంటి సైట్ల ద్వారా సినిమాలు చూడకుండా నిరాకరిస్తేనే ఈ బూతం ఆగుతుంది. లేదంటే, పేర్లు మారినా, రూపాలు మారినా పైరసీ వెబ్సైట్లు మళ్లీ మళ్లీ పుట్టుకురావడం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on October 2, 2025 10:24 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…