హిందీ సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు సంపాదించిన రాజస్థానీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో సవాయ్ తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. అతడి వయసు 28 ఏళ్లు. ఫ్లాట్లోని డైనింగ్ ఏరియాలో అతను ఉరివేసుకుని కనిపించడంతో బయటి నుంచి వచ్చి చూసిన సోహానీ షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోహానీ ఉత్తరాది నటే అయినా.. ఆమె హైదరాబాద్లోనే ఉంటోంది. కాబోయే భర్త మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జీవితాన్ని ముగించాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందులో అతను వివరించాడు. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమని అతనుపేర్కొన్నాడు. తనకంటే ముందు సవాయ్కి మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మరిచిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
రాజస్థాన్కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని ఒక ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో సవాయ్ ఆత్మహత్యకు పాల్పడడం సోహానీకి షాక్. సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పేరు సంపాదించింది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోహానీ ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘ప్యార్ టెస్టింగ్స పేరుతో ఆమె ఒక సిరీస్ నిర్మిస్తోంది.
This post was last modified on September 30, 2025 7:15 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…