హిందీ సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు సంపాదించిన రాజస్థానీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో సవాయ్ తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. అతడి వయసు 28 ఏళ్లు. ఫ్లాట్లోని డైనింగ్ ఏరియాలో అతను ఉరివేసుకుని కనిపించడంతో బయటి నుంచి వచ్చి చూసిన సోహానీ షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోహానీ ఉత్తరాది నటే అయినా.. ఆమె హైదరాబాద్లోనే ఉంటోంది. కాబోయే భర్త మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జీవితాన్ని ముగించాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందులో అతను వివరించాడు. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమని అతనుపేర్కొన్నాడు. తనకంటే ముందు సవాయ్కి మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మరిచిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
రాజస్థాన్కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని ఒక ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో సవాయ్ ఆత్మహత్యకు పాల్పడడం సోహానీకి షాక్. సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పేరు సంపాదించింది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోహానీ ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘ప్యార్ టెస్టింగ్స పేరుతో ఆమె ఒక సిరీస్ నిర్మిస్తోంది.
This post was last modified on September 30, 2025 7:15 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…