హిందీ సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు సంపాదించిన రాజస్థానీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్లో సవాయ్ తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. అతడి వయసు 28 ఏళ్లు. ఫ్లాట్లోని డైనింగ్ ఏరియాలో అతను ఉరివేసుకుని కనిపించడంతో బయటి నుంచి వచ్చి చూసిన సోహానీ షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సోహానీ ఉత్తరాది నటే అయినా.. ఆమె హైదరాబాద్లోనే ఉంటోంది. కాబోయే భర్త మరణంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జీవితాన్ని ముగించాలనే తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందులో అతను వివరించాడు. గతంలో తాను చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమని అతనుపేర్కొన్నాడు. తనకంటే ముందు సవాయ్కి మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమెను మరిచిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహానీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.
రాజస్థాన్కు చెందిన సోహానీ కుమారి, సవాయ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారడంతో, పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లోని ఒక ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. ఇంతలో సవాయ్ ఆత్మహత్యకు పాల్పడడం సోహానీకి షాక్. సోహానీ కుమారి హిందీ సీరియల్స్ ద్వారా నటిగా పేరు సంపాదించింది. వాటిలో ‘యే హై చాహతే’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సోహానీ ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ‘ప్యార్ టెస్టింగ్స పేరుతో ఆమె ఒక సిరీస్ నిర్మిస్తోంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…