ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ చేసిన ది రాజా సాబ్ జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. కొత్త డేట్ ఎప్పుడో లీకైనప్పటికీ అఫీషియల్ గా బయటికి వచ్చింది మాత్రం కొత్త ట్రైలర్ రూపంలోనే. టీజర్ నే మూడు నిముషాలు చూపించిన దర్శకుడు మారుతీ ఈసారి ఇంకో అరనిమిషం అదనంగా మరో కంటెంట్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో డార్లింగ్ ఉండటంతో బిజినెస్ పరంగా అంచనాలు ఎక్కువ కాబోతున్నాయి. అయితే టీజర్ తో పోలిక లేకుండా ఇప్పుడీ వీడియోలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూపించిన మారుతీ స్వీట్ షాక్ ఇచ్చారు.
కథాపరంగా ఇంకొన్ని అంశాలు వివరించారు. చనిపోయిన తాత (సంజయ్ దత్) తమ ఆస్తిగా ఉన్న పెద్ద బంగాళాలో మకాం వేసి ఎవరినీ రానివ్వకుండా చేస్తున్నాడని గుర్తించిన మనవడు (ప్రభాస్) కొందరు మిత్రుల సహకారంతో అక్కడికి వెళ్తాడు. చేతబడి చేసే వాళ్ళ సహాయం తీసుకుంటాడు. కానీ అనుకున్నంత తేలిగ్గా అక్కడి వ్యవహారం ఉండదు. ప్రేమించిన అమ్మాయిలతో పాటు తను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. దెయ్యాలు, భూతాలే కాదు విచిత్ర జంతువులు, మొసళ్ళు, పాములు, ఏనుగులు ఇలా పెద్ద సెటప్ ఉంటుంది. ఒక రాక్షసుడు (ప్రభాస్) కూడా ఉంటాడు. అదేంటనేది తెరమీద చూడాలి.
కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ ని రెండు పాత్రల్లో చూపిస్తున్న మారుతీ ఈసారి క్లాస్, మాస్ రెండు మిక్స్ చేయడం విశేషం. విజువల్స్ బాగున్నాయి. మిరాయ్ కన్నా నాణ్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసుకున్న మారుతీ వాళ్లకు హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ అయితే తెప్పించేలా ఉన్నాడు. పేరుకి హారర్ అయినప్పటికీ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని హంగులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసుకుని మురిసిపోయేలా ఉన్నాడు. తమన్ నేపధ్య సంగీతంతో పాటు ఇతర టెక్నికల్ హంగులు బాగా కుదిరాయి. ఇంతకన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on September 29, 2025 6:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…