ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ చేసిన ది రాజా సాబ్ జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. కొత్త డేట్ ఎప్పుడో లీకైనప్పటికీ అఫీషియల్ గా బయటికి వచ్చింది మాత్రం కొత్త ట్రైలర్ రూపంలోనే. టీజర్ నే మూడు నిముషాలు చూపించిన దర్శకుడు మారుతీ ఈసారి ఇంకో అరనిమిషం అదనంగా మరో కంటెంట్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో డార్లింగ్ ఉండటంతో బిజినెస్ పరంగా అంచనాలు ఎక్కువ కాబోతున్నాయి. అయితే టీజర్ తో పోలిక లేకుండా ఇప్పుడీ వీడియోలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూపించిన మారుతీ స్వీట్ షాక్ ఇచ్చారు.
కథాపరంగా ఇంకొన్ని అంశాలు వివరించారు. చనిపోయిన తాత (సంజయ్ దత్) తమ ఆస్తిగా ఉన్న పెద్ద బంగాళాలో మకాం వేసి ఎవరినీ రానివ్వకుండా చేస్తున్నాడని గుర్తించిన మనవడు (ప్రభాస్) కొందరు మిత్రుల సహకారంతో అక్కడికి వెళ్తాడు. చేతబడి చేసే వాళ్ళ సహాయం తీసుకుంటాడు. కానీ అనుకున్నంత తేలిగ్గా అక్కడి వ్యవహారం ఉండదు. ప్రేమించిన అమ్మాయిలతో పాటు తను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. దెయ్యాలు, భూతాలే కాదు విచిత్ర జంతువులు, మొసళ్ళు, పాములు, ఏనుగులు ఇలా పెద్ద సెటప్ ఉంటుంది. ఒక రాక్షసుడు (ప్రభాస్) కూడా ఉంటాడు. అదేంటనేది తెరమీద చూడాలి.
కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ ని రెండు పాత్రల్లో చూపిస్తున్న మారుతీ ఈసారి క్లాస్, మాస్ రెండు మిక్స్ చేయడం విశేషం. విజువల్స్ బాగున్నాయి. మిరాయ్ కన్నా నాణ్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసుకున్న మారుతీ వాళ్లకు హాలీవుడ్ రేంజ్ ఫీలింగ్ అయితే తెప్పించేలా ఉన్నాడు. పేరుకి హారర్ అయినప్పటికీ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని హంగులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ ని ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసుకుని మురిసిపోయేలా ఉన్నాడు. తమన్ నేపధ్య సంగీతంతో పాటు ఇతర టెక్నికల్ హంగులు బాగా కుదిరాయి. ఇంతకన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది.
This post was last modified on September 29, 2025 6:24 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…