Movie News

స్టార్ హీరో కూతురు… డైరెక్టరైపోయింది

సినీ కటుంబాలకు చెందిన వాళ్లు.. ఈ ఇండస్ట్రీని కాదనుకుని వేరే రంగాల వైపు వెళ్లడం ఇప్పుడు అరుదు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువైనా సరే.. వారసులు ఇందులోకే వస్తుంటారు. హీరోల కొడుకులు హీరోలవడం చాలా కామన్. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలు కూడా నటన వైపు ఎక్కువగానే వస్తున్నారు. ఐతే సినిమాకు సంబంధించి అత్యంత కష్టమైన వ్యవహారం అయిన దర్శకత్వం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు.

దానికి అసాధారణ నైపుణ్యం ఉండాలి, అలాగే ఎంతో కసరత్తూ చేయాలి. మరి ఆ నైపుణ్యాలు ఉండి, కసరత్తు కూడా చేసినట్లే కనిపిస్తోంది తమిళ స్టార్లు సూర్య, జ్యోతికల ముద్దుల కూతురు దియ. అమ్మా నాన్నల సినీ వారసత్వాన్ని స్వీకరించిన ఈ అమ్మాయి 17 ఏళ్లకే డైరెక్టర్ అయిపోయింది. కాకపోతే తొలి ప్రయత్నంగా ఆమె తీసింది ఫీచర్ ఫిలిం మాత్రం కాదు. అదొక డాక్యుమెంట్ డ్రామా.

‘లీడింగ్ లైట్’ పేరుతో 13 నిమిషాల డాక్యుమెంట్ డ్రామాను దియా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ 24 సినిమా క్రాఫ్ట్స్‌లోని ఒక ప్రత్యేక విభాగం గురించి కావడం విశేషం. ఒక సినిమా తెరకెక్కడం వెనుక ప్రతి విభాగం కష్టం ఎంతో ఉంటుంది. అందులో లైటింగ్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో ఎక్కువగా మగవాళ్లే పని చేస్తారు. ఈ విభాగంలో ముగ్గురు మహిళలు అడుగు పెట్టి ఎలా సక్సెస్ అయ్యారనే పాయింట్ మీద ‘లీడింగ్ లైట్’ డాక్యుడ్రామాను రూపొందించింది దియా.

సూర్య, జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్‌లో భాగంగా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విశేషం. అక్కడ దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. వచ్చే సంవత్సరానికి అకాడమీ అవార్డుల్లో డాక్యుమెంటరీ విభాగంలో ‘లీడింగ్ లైట్’ పోటీ పడే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో దియా ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కావడం లాంఛనమే అంటున్నారు.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

7 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

38 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago