సినీ కటుంబాలకు చెందిన వాళ్లు.. ఈ ఇండస్ట్రీని కాదనుకుని వేరే రంగాల వైపు వెళ్లడం ఇప్పుడు అరుదు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువైనా సరే.. వారసులు ఇందులోకే వస్తుంటారు. హీరోల కొడుకులు హీరోలవడం చాలా కామన్. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలు కూడా నటన వైపు ఎక్కువగానే వస్తున్నారు. ఐతే సినిమాకు సంబంధించి అత్యంత కష్టమైన వ్యవహారం అయిన దర్శకత్వం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు.
దానికి అసాధారణ నైపుణ్యం ఉండాలి, అలాగే ఎంతో కసరత్తూ చేయాలి. మరి ఆ నైపుణ్యాలు ఉండి, కసరత్తు కూడా చేసినట్లే కనిపిస్తోంది తమిళ స్టార్లు సూర్య, జ్యోతికల ముద్దుల కూతురు దియ. అమ్మా నాన్నల సినీ వారసత్వాన్ని స్వీకరించిన ఈ అమ్మాయి 17 ఏళ్లకే డైరెక్టర్ అయిపోయింది. కాకపోతే తొలి ప్రయత్నంగా ఆమె తీసింది ఫీచర్ ఫిలిం మాత్రం కాదు. అదొక డాక్యుమెంట్ డ్రామా.
‘లీడింగ్ లైట్’ పేరుతో 13 నిమిషాల డాక్యుమెంట్ డ్రామాను దియా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ 24 సినిమా క్రాఫ్ట్స్లోని ఒక ప్రత్యేక విభాగం గురించి కావడం విశేషం. ఒక సినిమా తెరకెక్కడం వెనుక ప్రతి విభాగం కష్టం ఎంతో ఉంటుంది. అందులో లైటింగ్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో ఎక్కువగా మగవాళ్లే పని చేస్తారు. ఈ విభాగంలో ముగ్గురు మహిళలు అడుగు పెట్టి ఎలా సక్సెస్ అయ్యారనే పాయింట్ మీద ‘లీడింగ్ లైట్’ డాక్యుడ్రామాను రూపొందించింది దియా.
సూర్య, జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్లో భాగంగా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విశేషం. అక్కడ దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. వచ్చే సంవత్సరానికి అకాడమీ అవార్డుల్లో డాక్యుమెంటరీ విభాగంలో ‘లీడింగ్ లైట్’ పోటీ పడే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో దియా ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కావడం లాంఛనమే అంటున్నారు.
This post was last modified on September 29, 2025 2:39 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…