సినీ కటుంబాలకు చెందిన వాళ్లు.. ఈ ఇండస్ట్రీని కాదనుకుని వేరే రంగాల వైపు వెళ్లడం ఇప్పుడు అరుదు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువైనా సరే.. వారసులు ఇందులోకే వస్తుంటారు. హీరోల కొడుకులు హీరోలవడం చాలా కామన్. ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిలు కూడా నటన వైపు ఎక్కువగానే వస్తున్నారు. ఐతే సినిమాకు సంబంధించి అత్యంత కష్టమైన వ్యవహారం అయిన దర్శకత్వం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు.
దానికి అసాధారణ నైపుణ్యం ఉండాలి, అలాగే ఎంతో కసరత్తూ చేయాలి. మరి ఆ నైపుణ్యాలు ఉండి, కసరత్తు కూడా చేసినట్లే కనిపిస్తోంది తమిళ స్టార్లు సూర్య, జ్యోతికల ముద్దుల కూతురు దియ. అమ్మా నాన్నల సినీ వారసత్వాన్ని స్వీకరించిన ఈ అమ్మాయి 17 ఏళ్లకే డైరెక్టర్ అయిపోయింది. కాకపోతే తొలి ప్రయత్నంగా ఆమె తీసింది ఫీచర్ ఫిలిం మాత్రం కాదు. అదొక డాక్యుమెంట్ డ్రామా.
‘లీడింగ్ లైట్’ పేరుతో 13 నిమిషాల డాక్యుమెంట్ డ్రామాను దియా రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ 24 సినిమా క్రాఫ్ట్స్లోని ఒక ప్రత్యేక విభాగం గురించి కావడం విశేషం. ఒక సినిమా తెరకెక్కడం వెనుక ప్రతి విభాగం కష్టం ఎంతో ఉంటుంది. అందులో లైటింగ్ పాత్ర ఎంతో కీలకం. ఇందులో ఎక్కువగా మగవాళ్లే పని చేస్తారు. ఈ విభాగంలో ముగ్గురు మహిళలు అడుగు పెట్టి ఎలా సక్సెస్ అయ్యారనే పాయింట్ మీద ‘లీడింగ్ లైట్’ డాక్యుడ్రామాను రూపొందించింది దియా.
సూర్య, జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్లో భాగంగా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించడం విశేషం. అక్కడ దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. వచ్చే సంవత్సరానికి అకాడమీ అవార్డుల్లో డాక్యుమెంటరీ విభాగంలో ‘లీడింగ్ లైట్’ పోటీ పడే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో దియా ఫీచర్ ఫిలిం డైరెక్టర్ కావడం లాంఛనమే అంటున్నారు.
This post was last modified on September 29, 2025 2:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…