టాలీవుడ్ నే కాదు ప్రతి బాషా పరిశ్రమను వేధిస్తున్న పైరసీని కట్టడి చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా పరిష్కారాలు దక్కిన దాఖలాలు చాలా తక్కువ. తాజాగా సినిమా పైరసీని చేస్తూ వేల కోట్ల నష్టాన్ని కలగజేస్తున్న ఆరుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం శుభవార్తగా చెప్పొచ్చు. మొన్న జూలైలో కిరణ్ అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ ముఠా తాలూకు మూలాలు దుబాయ్, మయన్మార్, నెదర్లాండ్ తదితర దేశాల్లో ఉన్నట్టు గుర్తించి వాటిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఆరుగురితో కూడిన గ్యాంగ్ సభ్యులు దొరికారు.
తెలుగు, హిందీ, తమిళం బాషా ఏదైనా సరే మొదటి రోజే పైరసీ చేసేందుకు ఒక ప్రత్యేక మెకానిజంని ఏర్పాటు చేసుకున్న పైరసీ గ్యాంగ్ పలు నగరాల్లో తమ మెంబర్స్ ని ఏర్పాటు చేసుకుంది. మల్టీప్లెక్సుల్లో, ఎంపిక చేసిన సింగల్ స్క్రీన్లు ఎంచుకుని రహస్యంగా కెమెరా ఫోన్లతో షూట్ చేయడం, ఏజెంట్లతో కుమ్మక్కై ప్రింట్లు బయటికి తేవడం, శాటిలైట్స్ ని సైతం డీ కోడ్ చేసే స్థాయికి వెళ్లడం ఇవన్నీ ఈ ముఠా చేసే అరాచకాలు. తాజాగా ఓజిని సైతం వీళ్ళు వదల్లేదు. దీన్ని బట్టే ఎంత నెట్ వర్క్ సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారితో విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి.
గత ఏడాదిగా విపరీతంగా పెచ్చుమీరిన పైరసీ వల్ల సుమారు 22 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక అంచనా. గేమ్ చేంజర్ మొదటి రోజే హెచ్డి ప్రింట్ బయటికి రావడం అందరిని నివ్వెరపోయేలా చేసింది. ఇప్పుడీ అరెస్టు వల్ల కలిగే ప్రయోజనం కేవలం మనకు మాత్రమే కాదు. బాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమలు ఊరట చెందుతాయి. కాకపోతే విదేశాల్లో ఉంటూ అక్కడి సర్వర్ల ద్వారా పైరసీని విశ్వవ్యాప్తం చేస్తున్న అసలు దొంగలను పట్టుకునే మార్గాలు అన్వేషించాలి. అప్పుడే దీనికి అడ్డు కట్ట పడుతుంది. అప్పుడెప్పుడో సూర్య సినిమా వీడోక్కడేలో చూపించినట్టు పైరసీ విశ్వరూపం అనుకున్న దానికన్నా చాలా పెద్దదే ఉంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…