తమిళ నటుడు, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీని స్థాపించిన విజయ్ ఒక్క దెబ్బకు చిక్కుల్లో పడిపోయారు. మరో 7 నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోగా… వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఇప్పుడు తమిళనాట రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన విజయ్… ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఘటనపై సీబీఐ చేత విచారణ చేయించాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో విజయ్ అభ్యర్థించారు.
ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో రాళ్ల దాడులు, ఆపై ఏ కారణం లేకుండానే పోలీసుల లాఠీచార్జీ జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే… టీవీకేను ఆదిలోనే తొక్కేయాలని రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నది విజయ్ అనుమానంగా తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత కరూర్ నుంచి గట్టి భద్రతా చర్యల మధ్య చెన్నై చేరుకున్న విజయ్… ఆదివారం ఉదయమే పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు లీగల్ సెల్ ముఖ్యులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీపై ఇతర పార్టీలు చేస్తున్న కుట్రలు, వాటిని ఎదుర్కొనే తీరుపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలోనే సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు.
అనుకున్నదే తడవుగా ఆదివారం మధ్యాహ్నం టీవీకే లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, దీనిని నిగ్గు తేల్చాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐ చేత విచారణ చేయించాలని టీవీకే ఆ పిటిషన్ లో కోరింది. ఎలాంటి అలజడి లేకుండానే రాళ్ల దాడులు జరిగాయని, అదే సమయంలో ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారని, ఇవన్నీచూస్తుంటే… ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని అందులో పేర్కొంది. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
This post was last modified on September 28, 2025 2:53 pm
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…