తమిళ నటుడు, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీని స్థాపించిన విజయ్ ఒక్క దెబ్బకు చిక్కుల్లో పడిపోయారు. మరో 7 నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది చనిపోగా… వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఇప్పుడు తమిళనాట రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన విజయ్… ఆదివారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఘటనపై సీబీఐ చేత విచారణ చేయించాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో విజయ్ అభ్యర్థించారు.
ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో రాళ్ల దాడులు, ఆపై ఏ కారణం లేకుండానే పోలీసుల లాఠీచార్జీ జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే… టీవీకేను ఆదిలోనే తొక్కేయాలని రాష్ట్రంలోని అధికార, విపక్షాలన్నీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నది విజయ్ అనుమానంగా తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన తర్వాత కరూర్ నుంచి గట్టి భద్రతా చర్యల మధ్య చెన్నై చేరుకున్న విజయ్… ఆదివారం ఉదయమే పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు లీగల్ సెల్ ముఖ్యులతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీపై ఇతర పార్టీలు చేస్తున్న కుట్రలు, వాటిని ఎదుర్కొనే తీరుపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలోనే సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించాలని తీర్మానించారు.
అనుకున్నదే తడవుగా ఆదివారం మధ్యాహ్నం టీవీకే లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉందని, దీనిని నిగ్గు తేల్చాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థగా ఉన్న సీబీఐ చేత విచారణ చేయించాలని టీవీకే ఆ పిటిషన్ లో కోరింది. ఎలాంటి అలజడి లేకుండానే రాళ్ల దాడులు జరిగాయని, అదే సమయంలో ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారని, ఇవన్నీచూస్తుంటే… ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని తాము అనుమానిస్తున్నామని అందులో పేర్కొంది. ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
This post was last modified on September 28, 2025 2:53 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…