Movie News

లేడీ విలన్ డైరెక్టర్ అవుతోంది

తమిళ లెజెండరీ నటుడు శరత్ కుమార్ తనయురాలు అనే గుర్తింపుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి.. తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. హీరోయిన్‌గా ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. క్యారెక్టర్, విలన్ రోల్స్ చేయడం మొదలుపెట్టాకే బిజీ అయింది. ముఖ్యంగా తెలుగులో ఆమెకు అదిరిపోయే రోల్స్ పడ్డాయి. 

‘క్రాక్’ మూవీలో అద్భుతంగా విలనీని పండించడంతో ఆమె టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుగా మారింది. ‘వీరసింహారెడ్డి’ సహా మరిన్ని చిత్రాలు వరలక్ష్మికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. గత ఏడాదే నికోల్ సచ్‌దేవ్ అనే ముంబయి వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన వరలక్ష్మి.. ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గించినట్లు అనిపిస్తోంది. కానీ ఆ గ్యాప్ దర్శకురాలు కావడం కోసమని ఇప్పుడే తెలిసింది. 

‘సరస్వతి’ అనే పాన్ ఇండియా మూవీతో వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా కావడం విశేషం. దోస డైరీస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన వరలక్ష్మి.. తన సోదరి పూజ శరత్ కుమార్‌తో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుంది. దర్శకురాలిగా తన తొలి చిత్రంలో ప్రియమణి, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. 

అటు తమిళంలో అయినా, ఇటు తెలుగులో అయినా లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. అందులో సక్సెస్ అయిన వాళ్లు అరుదే. ప్రస్తుతం సుధ కొంగర మాత్రమే విజయవంతంగా సాగుతోంది. మరి వరలక్ష్మి కూడా అలాగే దర్శకురాలిగా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి. థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న ‘సరస్వతి’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

Kumar

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

19 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

47 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

2 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago