కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కున్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కొత్త సినిమా, పాత రీ రిలీజ్ ఏదైనా అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక్కడు రీమేక్ గిల్లి ఇప్పటిదాకా వచ్చిన రీ రిలీజుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. మూడు కోట్లకు పైగా మొదటి రోజు గ్రాస్ తో మొన్నటి ఏడాది బయ్యర్ల మతులు పోగొట్టింది. విజయ్ లిస్టులో యావరేజ్ గా అనిపించే సచిన్ సైతం కోటి డెబ్భై ఆరు లక్షలతో రెండో స్థానంలో ఉంది. అలాంటిది ఖుషి ఇంకెలాంటి రికార్డులు బద్దలు కొడుతుందోనని ఆశించడం సహజం. నిర్మాత ఏఎం రత్నం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొత్త ప్రింట్ తో ఖుషిని థియేటర్లకు తీసుకొచ్చారు.
తీరా చూస్తే ఖుషి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోలేదని కోలీవుడ్ ట్రేడ్ టాక్. డెబ్భై లక్షల దాకా గ్రాస్ వసూలయ్యిందని చెబుతున్నారు. అంటే సచిన్ కన్నా చాలా తక్కువ. బాబా, దీనా, బిల్లా కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ గిల్లిని దాటుతుందని భావించిన ఫ్యాన్స్ కోరిక నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ ఖుషి దీని రీమేకన్న సంగతి తెలిసిందే. అప్పట్లో రెండు ఒకేసారి తీయాలనుకున్నారు. ఆ మాటకొస్తే ముందు పవన్ వెర్షన్ అయ్యాక విజయ్ ది తీయాలని ప్లాన్. కానీ రకరకాల కారణాల వల్ల మార్చుకున్నారు. రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాగా ఖుషి పేరు మీద ఎన్నో మైలురాళ్లున్నాయి.
తెలుగు ఖుషి రీ రిలీజ్ చేసినప్పుడు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. కానీ తమిళంలో ఇలా జరగడం విచిత్రం. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో అతనికి సంబంధించిన సినిమాల సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని విశ్లేషకులు భావించారు. కానీ ఖుషికి అలా జరగలేదు. జనవరి 9 విడుదల కాబోతున్న జన నాయకుడు ఏం చేస్తుందనే దాని మీద ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పొలిటికల్ గా యాక్టివ్ కావడంతో విజయ్ కు దాని తాలూకు సెగలు వివిధ రూపాల్లో తగులుతున్నాయి. జన నాయకుడులో సున్నితమైన అంశాలు చాలానే టచ్ చేశారని అంటున్నారు. వివాదాలు అయ్యే ఛాన్స్ లేకపోలేదు.
This post was last modified on September 26, 2025 9:30 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…