బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటి శ్రీదేవి ప్రేమకథ చాలాసార్లు వార్తల్లో నిలిచింది. 1996లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన మొదటి భార్య మోనాతో, ఇద్దరు పిల్లలతో ఉన్నారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం. ఇక తాజాగా బోనీ ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వారి పెళ్లి రింగ్స్ వెనుక ఉన్న నిజం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది.
బోనీ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆయన, శ్రీదేవి వేసుకున్న వెడ్డింగ్ రింగ్స్ను అసలు మొదటి భార్య మోనా కొనిచ్చారట. “నేను మోనాకు నిజం చెప్పాను. శ్రీదేవితో ఉన్న బంధం దాచలేదు. నేను ధరించిన రింగ్, శ్రీదేవి ధరించిన రింగ్ రెండూ మోనా కొన్నవే. ఆమె ఎప్పుడూ పిల్లల మనసులో నాపై ద్వేషం రానివ్వలేదు” అని బోనీ చెప్పారు.
అయితే ఈ నిర్ణయం ఆయన పిల్లలు అర్జున్, అంషులపై ప్రభావం చూపిందని బోనీ ఒప్పుకున్నారు. “నా కొడుకు అర్జున్ ఒక లేఖ ద్వారా ‘నాన్నా, ఇంటికి ఎందుకు రారు?’ అని అడిగాడు. అది నాకు చాలా బాధ కలిగించింది. కానీ నాకు రెండు వైపులా ఇబ్బంది. ఓవైపు శ్రీదేవి ఒంటరిగా ఉండేది, ఆమెను అలా వదిలేయలేక మాధనపడ్డాను. నా పిల్లలు మాత్రం అమ్మతో, తాతమ్మలతో ఉన్నారు” అని గుర్తు చేసుకున్నారు.
బోనీ తన జీవితంలో మోనా పాత్ర చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. “ఆమె పిల్లల్ని నాపై గాని, శ్రీదేవి పిల్లలపై గాని వ్యతిరేకంగా మార్చలేదు. పిల్లలు ఆమె బాధ చూసి బాధపడేవారు, కానీ ఎప్పుడూ ద్వేషం పెంచలేదు. అందుకే ఇప్పుడు నా నలుగురు పిల్లలు.. అర్జున్, అంషులా, జాన్వీ, ఖుషి ఒక కుటుంబంలా కలసి ఉన్నారు” అని బోణి తెలిపారు. ఇక 2018లో శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత ఈ కుటుంబం మరింత దగ్గరైంది. ఆ సమయంలో అర్జున్, అంషులా ఇద్దరూ జాన్వీ, ఖుషికి అండగా నిలిచారు. తల్లి కోల్పోయిన బాధలో అన్నచెల్లెళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు.
This post was last modified on September 26, 2025 4:49 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…