Movie News

శ్రీదేవి, బోనీ కపూర్ పెళ్లి రహస్యం.. మొదటి భార్య ఇచ్చిన రింగ్స్!

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటి శ్రీదేవి ప్రేమకథ చాలాసార్లు వార్తల్లో నిలిచింది. 1996లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన మొదటి భార్య మోనాతో, ఇద్దరు పిల్లలతో ఉన్నారు. ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనం. ఇక తాజాగా బోనీ ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వారి పెళ్లి రింగ్స్ వెనుక ఉన్న నిజం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అయింది.

బోనీ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆయన, శ్రీదేవి వేసుకున్న వెడ్డింగ్ రింగ్స్‌ను అసలు మొదటి భార్య మోనా కొనిచ్చారట. “నేను మోనాకు నిజం చెప్పాను. శ్రీదేవితో ఉన్న బంధం దాచలేదు. నేను ధరించిన రింగ్, శ్రీదేవి ధరించిన రింగ్ రెండూ మోనా కొన్నవే. ఆమె ఎప్పుడూ పిల్లల మనసులో నాపై ద్వేషం రానివ్వలేదు” అని బోనీ చెప్పారు.

అయితే ఈ నిర్ణయం ఆయన పిల్లలు అర్జున్, అంషులపై ప్రభావం చూపిందని బోనీ ఒప్పుకున్నారు. “నా కొడుకు అర్జున్ ఒక లేఖ ద్వారా ‘నాన్నా, ఇంటికి ఎందుకు రారు?’ అని అడిగాడు. అది నాకు చాలా బాధ కలిగించింది. కానీ నాకు రెండు వైపులా ఇబ్బంది. ఓవైపు శ్రీదేవి ఒంటరిగా ఉండేది, ఆమెను అలా వదిలేయలేక మాధనపడ్డాను. నా పిల్లలు మాత్రం అమ్మతో, తాతమ్మలతో ఉన్నారు” అని గుర్తు చేసుకున్నారు.

బోనీ తన జీవితంలో మోనా పాత్ర చాలా గొప్పదని చెప్పుకొచ్చారు. “ఆమె పిల్లల్ని నాపై గాని, శ్రీదేవి పిల్లలపై గాని వ్యతిరేకంగా మార్చలేదు. పిల్లలు ఆమె బాధ చూసి బాధపడేవారు, కానీ ఎప్పుడూ ద్వేషం పెంచలేదు. అందుకే ఇప్పుడు నా నలుగురు పిల్లలు.. అర్జున్, అంషులా, జాన్వీ, ఖుషి ఒక కుటుంబంలా కలసి ఉన్నారు” అని బోణి తెలిపారు. ఇక 2018లో శ్రీదేవి ఆకస్మిక మరణం తర్వాత ఈ కుటుంబం మరింత దగ్గరైంది. ఆ సమయంలో అర్జున్, అంషులా ఇద్దరూ జాన్వీ, ఖుషికి అండగా నిలిచారు. తల్లి కోల్పోయిన బాధలో అన్నచెల్లెళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. 

This post was last modified on September 26, 2025 4:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

6 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

7 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

8 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

8 hours ago