విదేశీ లగ్జరీ కార్లకు కస్టమ్ సుంకాలు చెల్లించకుండా.. దొడ్డిదారిలో సొంతం చేసుకున్నారన్న ఆరోపణలతో ప్రముఖ బహుభాషా నటులు, మలయాళ సినీ రంగానికి చెందిన దుల్కర్ సల్మాన్(మహానటి ఫేమ్), పృథ్వీరాజ్ సుకుమారన్ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ఇళ్లపై కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. `ఆపరేషన్ నమకూర్` పేరుతో నిర్వహించిన ఈ దాడులలో నటుల ఆస్తులు, వారి లగ్జరీ కార్లపై అధికారులు దృష్టి పెట్టారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలు.. ఆదాయ వ్యయాల వివరాలను కూడా సేకరించారు.
అసలేంటీ కేసు?
ఇతర దేశాలు.. కొన్ని కొన్ని సందర్భాల్లో వాడని లగ్జరీ కార్లను తక్కువ ధరలకు విక్రయిస్తాయి. వాటిని ప్రముఖులు కొనుగోలు చేస్తుంటారు. ఇలా.. భారత్కు పొరుగున ఉన్న భూటాన్ సైన్యం కొనుగోలు చేసి కూడా ఉపయోగించని కొన్ని ఖరీదైన వాహనాలను విక్రయించింది. వీటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతితక్కువ ధరకు దక్కించుకున్నారు. అనంతరం.. వాటిని ఇతరులకు విక్రయించారు. ఇలా.. కొనుగోలు చేసిన వాటికి కస్టమ్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అలా చెల్లించకుండానే భారత్కు తీసుకువచ్చారన్నది కస్టమ్ అధికారుల వాదన.
ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేరళ, తమిళనాడు, కర్ణాటకల లోని సినీ ప్రముఖులు, వ్యాపారుల ఇళ్లపై కస్టమ్ అధికారులు దాడులు చేశారు. అయితే.. కేరళ సినీ రంగా నికి చెందిన ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్లు ఎలాంటి వాహనాలుకొనుగోలు చేయలేద ని గుర్తించినట్టు తెలిసింది. అయితే.. దాడులు కొనుసాగుతున్నట్టు కస్టమ్ అధికారులు తెలిపారు.
This post was last modified on September 23, 2025 3:30 pm
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…