‘అ!’ లాంటి వైవిధ్యమైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు ప్రశాంత్ వర్మ. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా.. కమర్షియల్గా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత అతను తీసిన ‘కల్కి’ నిరాశపరిచింది. ‘జాంబి రెడ్డి’ ఓ మాదిరిగా ఆడింది. ఐతే ప్రశాంత్ నాలుగో చిత్రం ‘హనుమాన్’ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రశాంత్ మీద అంచనాలు పెరిగిపోయాయి. పెద్ద స్టార్లలోనూ తనతో సినిమా చేయాలన్న ఆసక్తి కనిపించింది. ఏకంగా ప్రభాస్ సైతం సినిమా చేయడానికి అంగీకరించాడు.
ఐతే ఈ కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందన్నదే క్లారిటీ లేదు. ఈలోపు ప్రశాంత్ ఒకదాని తర్వాత ఒకటి సినిమా అనౌన్స్ చేస్తున్నాడు. కానీ అవి ముందుకు మాత్రం కదలడం లేదు. ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో ‘బ్రహ్మ రాక్షస్’ అనే సినిమా తీయాలనుకున్నాడు. ఇందుకోసం ప్రి విజువలైజేషన్ షూట్ కూడా చేశాడు. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. మరోవైపు ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను ప్రకటించి చాలా కాలమైంది. కానీ తర్వాత అప్డేట్ లేదు.
ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రిషబ్ శెట్టి ఏమో వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మధ్యలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు, అది తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్లో భాగమన్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. కానీ ఆ సినిమా ఏవో కారణాలతో ముందుకు కదల్లేదు. తర్వాత ప్రభాస్ సినిమా తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు కూడా స్క్రిప్టు రెడీగా ఉంది కానీ.. ప్రభాస్ అందుబాటులోకి రావడంపైనే ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తేలుతుందని చెప్పాడు ప్రశాంత్.
ఇప్పుడేమో పీవీసీయూ నుంచి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అధీర పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఇందులో విలన్గా ఎస్.జె.సూర్యను కన్ఫమ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బాగానే అనిపిస్తోంది. దీనికి ప్రశాంత్ స్క్రిప్టు అందించి, దర్శకత్వ పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఐతే ఈ సినిమా అనౌన్స్మెంట్ చూసి సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఇలా అనౌన్స్మెంట్లు ఇవ్వడమేనా.. సినిమాలు తీసేదేమైనా ఉందా? ఈ చిత్రమైనా వెంటనే సెట్స్ మీదికి వెళ్తుందా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి ప్రశాంత్ షూటింగ్ మొదలుపెట్టించి సమాధానం ఇస్తాడా?
This post was last modified on September 23, 2025 9:23 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…