కొందరు హీరోయిన్లు గ్లామర్తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తారు. కొందరు కేవలం నటనతోనే మెప్పిస్తారు. వారిని గ్లామర్ కోణంలో అభిమానులు చూడరు. ఈ రెండో కోవకు చెందిన హీరోయిన్లు హాట్ హాట్గా కనిపించే ప్రయత్నం చేసినా వ్యతిరేకత వ్యక్తమవుతుంటుంది. వాళ్లను సంప్రదాయబద్ధంగా చూడడానికే ఫ్యాన్స్ ఇష్టపడతారు. సాయిపల్లవి ఈ కోవకే చెందుతుంది. తొలి చిత్రం ‘ప్రేమమ్’ నుంచి ఆమె తన పెర్ఫామెన్స్తోనే ఆకట్టుకుంటోంది. తనలో గ్లామర్ కోణం ఎప్పుడూ ఎలివేట్ కాలేదు. ఫిలిం మేకర్స్ కూడా తనను అలా చూపించడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించారు.
ఇలాంటి టైంలో సాయిపల్లవి స్విమ్ సూట్, బికినీ డ్రెస్సుల్లో కనిపించేసరికి ఫ్యాన్స్ షాకవుతున్నారు. తన చెల్లెలితో కలిసి వెకేషన్కు వెళ్లిన సాయిపల్లవి.. స్విమ్ సూట్, బికినీల్లో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఈ ఫొటోలు తెగ తిరుగుతున్నాయి. వీటిని చూసి సాయిపల్లవి కూడా ఇలా తయారైపోయిందేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కొందరు ‘రామాయణం’ లాంటి సినిమాలో నటిస్తూ ఇవేం వేషాలు అంటూ తిట్టిపోస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. అవి ఒరిజినల్ ఫొటోలు కావు. సాయిపల్లవి సోదరి షేర్ చేసిన కొన్ని ఫొటోలను ఆధారంగా చేసుకుని.. ఈ స్టార్ హీరోయిన్ స్విమ్ సూట్లో ఉన్నట్లు, టూపీస్ బికినీ వేసినట్లు ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ సాయిపల్లవి సోదరి ఇన్స్టా అకౌంట్లోకి వెళ్తే ఇవి ఫేక్ అనే విషయం అర్థమైపోతుంది. కానీ అది తెలియక చాలామంది తప్పుగా అర్థం చేసుకుని ఇవి ఒరిజినల్ అనుకుంటున్నారు. సాయిపల్లవిని ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on September 23, 2025 7:36 am
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…