‘గబ్బర్ సింగ్’ సినిమా రిలీజైనపుడు ఆ సినిమా చూసి జై పవర్ స్టార్ అనుకుంటూ బయటికి వచ్చిన సగటు పవన్ కళ్యాన్ అభిమాని సుజీత్. ఈ రోజు పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న ‘ఓజీ’ సినిమాను అతను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు.. రికార్డుల మోత మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే అతను పవన్తో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. అతడి చివరి చిత్రం ‘సాహో’ రేంజ్ ఏంటో తెలిసిందే. ఇంత భారీ చిత్రం చేయడానికి పునాది వేసిన మూవీ.. రన్ రాజా రన్. శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది.
ఈ సినిమా కార్యరూపం దాల్చడం వెనుక పెద్ద స్టోరీనే ఉందంటున్నాడు సుజీత్. ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా వెనుక బ్యాక్ స్టోరీని అతను వెల్లడించాడు. ఆ సంగతులు తన మాటల్లోనే.. ‘‘అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఒక మంచి ప్రేమకథ రాసుకున్నా. ఒక ప్రొడక్షన్ హౌస్కు వెళ్లి కథ వినిపించా. వారికి ఫస్టాఫ్ నచ్చింది. సెకండాప్ కోసం ఐదు నెలలు పని చేశా. మంచి వెర్షన్ రాసి మళ్లీ ప్రొడక్షన్ హౌస్ను కలిసి వినిపించా. వాళ్లు సూపర్ అన్నారు. సినిమా ఓకే అయిందన్న సంతోషంలో బైక్ మీద బయల్దేరా.
నా ఫోన్ రింగయింది. పక్కన ఆపి కాల్ తీస్తే.. ఆ కథకు బడ్జెట్ ఎక్కువ అయ్యేలా ఉంది. వేరే కథ ఆలోచించమని నిర్మాత చెప్పారు. నా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. రోడ్డు పక్కన కూర్చుని మూడు గంటలు ఏడ్చాను. వెన్నెల కిషోర్కు ఫోన్ చేస్తే తను ధైర్యం చెప్పాడు. షార్ట్ ఫిలిం గంటలో రాయగలవు. సినిమా ఒక రోజులో రాయలేవా అన్నాడు. సరే అనుకుని బండి స్టార్ చేస్తే అది కదల్లేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో డబ్బుల్లేవు. జోరు వాన. బండిని నెట్టుకుంటూ జూబ్లీ హిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.
ఇంటికొచ్చి తల తుడుచుకుంటుంటే రన్ రాజా రన్ కథ ఫ్లాష్ అయింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి సంవత్సరం నుంచి ఒక కథ రాస్తున్నా, చెప్పమంటారా అన్నాను. రేపు వచ్చేయమన్నారు. మూడు రోజుల తర్వాత వస్తా అని చెప్పి.. ఆ మూడు రోజుల్లోనే కథ రాసుకుని వెళ్లి వినిపించా. వాళ్లు చిన్న మార్పు చెప్పకుండా సినిమా ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు. మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుందనడానికి ఇది ఉదాహరణ’’ అని సుజీత్ చెప్పాడు.
This post was last modified on September 22, 2025 8:00 pm
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…