విశ్వంభర ఆలస్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అన్నది బహిరంగ రహస్యమే అయినా బడ్జెట్ సమస్యలు కూడా చుట్టముట్టడం వల్లే యువి క్రియేషన్స్ లేట్ చేసిందనేది ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం. దానికి తగ్గట్టే అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీని వాయిదా వేసుకుని హీరోని లెనిన్ కోసం వదిలేయడం, హిట్టయ్యి ఆర్థిక బలం ఇస్తుందంటే ఘాటీ డిజాస్టర్ కావడం లాంటి కారణాలు విశ్వంభరను ఇంకా వెనక్కు నెట్టేలా చేశాయి. దెబ్బకు మన శంకరవరప్రసాద్ గారుని సంక్రాంతికి తీసుకురావాల్సి వచ్చింది. మరి మెగా మూవీకి మోక్షం ఎప్పుడో, కొత్త రిలీజ్డ్ డేట్ ఏదో సరైన క్లారిటీ లేదు.
మావయ్య చిరంజీవికి వచ్చిన సమస్యే అల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ చుట్టుకుంది. సంబరాల ఏటిగట్టు ఎప్పుడో నెలల క్రితం సెప్టెంబర్ 25 రిలీజ్ డేట్ వేసుకున్నారు. కానీ ఓజికి లాక్ చేసుకున్నాక ఇది రాదని అందరికీ అర్థమైపోయింది. కానీ టీమ్ మాత్రం వాయిదా గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది. భారీ సెట్లు, పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సాయి తేజ్ సిక్స్ ప్యాక్ బాడీ ఇలా చాలానే కష్టపడ్డారు. హనుమాన్ నిర్మాతల బ్యానర్ కావడంతో బడ్జెట్ విషయంలో రాజీ లేదన్నారు. తీరా చూస్తే ఖర్చు చేయి దాటిపోవడంతో కొంత బ్రేకులు వేశారనేది అనఫీషియల్ గా తిరిగిన న్యూసు.
ఇప్పుడీ సంబరాల ఏటిగట్టుకి సైతం విడుదల తేదీ స్పష్టత లేదు. మొన్న ఇచ్చిన మీడియా నోట్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ కోసం లేట్ అవుతోందని, సాంకేతిక కారణాలు చెబుతూ త్వరలో శుభవార్త వినిపిస్తామని అందులో సుదీర్ఘంగా పేర్కొన్నారు. 2025లో రావడం కష్టమే. ఎందుకంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా నెలకు రెండు మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టి ఉన్నాయి. పోనీ జనవరి అంటే అదేమో ప్యాకైపోయింది. సంబరాల ఏటిగట్టుకి సోలో రిలీజ్ చాలా ముఖ్యం. అది కూడా అంత సులభం కాదు. 2026 వేసవిలో విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. మావయ్యలు లేని టైం చూసుకుని సాయి తేజ్ స్లాట్ బుక్ చేసుకోవాలి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…