Movie News

దృశ్యం దర్శకుడు నిరాశపరిచారు

మలయాళం దర్శకుడే అయినా జీతూ జోసెఫ్ మీద తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి కార్నర్ ఉంది. వెంకటేష్ దృశ్యం 2ని డైరెక్ట్ చేసింది ఈయనే. ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడి సృష్టించిన ఈ క్రియేటివ్ జీనియస్ ది మలుపులు రాసుకోవడంలో అందె వేసిన చేయి. మోహన్ లాల్ నేరు అనే మూవీ మన దగ్గర థియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఓటిటిలో చూసిన తెలుగు ఆడియన్స్ అందులో ట్విస్టులకు థ్రిల్ అయ్యారు. దృశ్యం 3కి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో జీతూ జోసెఫ్ కొత్త సినిమా మిరేజ్ మొన్న శుక్రవారం విడుదలయ్యింది. అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి జంటగా దీని మీద మంచి అంచనాలే నెలకొన్నాయి.

అనూహ్యంగా మిరేజ్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. ఊహకందని కథనంతో మేజిక్ చేసే జీతూ జోసెఫ్ ఈసారి చాలా తడబడ్డారు. ముందు కథేంటో చూద్దాం. ఆర్థిక లావాదేవీలు నడిపే ఒక పెద్ద కంపెనీ ఉద్యోగి కిరణ్ హఠాత్తుగా ఒక ట్రైన్ ప్రమాదంలో చనిపోతాడు. వేలకోట్ల విలువైన స్కాముల డేటా ఉన్న ఒక హార్డ్ డిస్క్ అతని దగ్గరే ఉండిపోతుంది. దాని కోసం కిరణ్ ని ప్రేమించి ఎంగేజ్ మెంట్ చేసుకున్న అభిరామి వెనుక పోలీసులు, గూండాలు పడతారు. సహాయం కోసం అశ్విన్ అనే యూట్యూబర్ వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు అసలు హంతకుడిని పట్టివ్వడమే స్టోరీ.

చాలా రొటీన్ అనిపించే ప్లాట్ తీసుకున్న జీతూ జోసెఫ్ ఈసారి బిగుతైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. దీంతో చాలా ట్విస్టులు ముందే ఊహించవచ్చు. కిరణ్ చనిపోయి ఉండడని చిన్నపిల్లాడు సైతం చెప్పేలా ఉండటం రైటింగ్ లోపమే. రెండు గంటల్లో చెప్పాల్సిన కంటెంట్ ని అదనంగా ఇంకో అరగంట పొడిగించడంతో చాలా ఎక్కువ ల్యాగ్ అనిపిస్తుంది. చివరి నలభై నిమిషాల్లో వచ్చే కొన్ని మలుపులు ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. కొన్ని మాత్రమే పేలాయి. గత ఏడాది నూనకుజ్జితో డీసెంట్ సక్సెస్ అందుకున్న జీతూ జోసెఫ్ కి మిరేజ్ మాత్రం ఫ్లాప్ గా నిలవనుంది. దృశ్యం 3ని ఏం చేస్తారో మరి.

This post was last modified on September 21, 2025 5:56 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

2 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

4 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

6 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

7 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

8 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

8 hours ago