రీమేక్ సినిమాలంటే జనాలకు పూర్తిగా వ్యతిరేక భావం వచ్చేసిన రోజులు ఇవి. ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి రీమేక్స్ వర్కవుట్ కావడం లేదు. ఒక సినిమా రీమేక్ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఒరిజినల్ చూడని వాళ్లు కూడా రీమేక్ అనగానే లైట్ తీసుకుంటున్న పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి నుంచి.. యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ వరకు గత కొన్నేళ్లలో రీమేక్లు ట్రై చేసిన వాళ్లందరూ ఎదురు దెబ్బలు తిన్నవాళ్లే. రీమేక్ చేయడం తప్పన్న నిర్ణయానికి వచ్చిన వాళ్లే.
అయినా సరే.. కొందరు హీరోలు మాత్రం ఆ ప్రయత్నాలు మానట్లేదు. టాలీవుడ్లో అత్యధిక రీమేక్ల్లో నటించిన హీరోల్లో ఒకరైన రాజశేఖర్.. హిట్టు కోసం మళ్లీ వేరే భాష సినిమా మీద ఆధారపడ్డట్లు సమాచారం. తమిళంలో పెద్ద హిట్టయిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట రాజశేఖర్. ఇది గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే సినిమా. ఒరిజినల్లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట. పిట్టగోడ, 35 చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడట.
రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్గా కనిపించనుందట. ఐతే ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలతో ఆయన చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటి చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఈ అనుభవాల తర్వాత కూడా ఆయన మళ్లీ ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. అందులోనూ ‘లబ్బర్ పందు’ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో మన ఆడియన్స్ బాగానే చూశారు. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నది సందేహమే.
This post was last modified on September 21, 2025 1:21 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…