వంద కోట్ల గ్రాస్ దాటేసింది కాబట్టి మిరాయ్ బాగా నెమ్మదిస్తుందనుకున్న టైంలో మరోసారి నక్క తోక తొక్కేసింది. ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల విన్నపానికి స్పందించి రెండు రోజులు ముందుగానే దసరా సెలవులు ఇచ్చేయడంతో ఒక్కసారిగా సాయంత్రం షోలు ఊపందుకున్నాయి. ఎలాగూ హాలిడేస్ కాబట్టి పిల్లలను సెకండ్ షోలకు తీసుకెళ్లడానికి తల్లితండ్రులు రెడీ అయిపోతున్నారు. ఈ ప్రభావం బుకింగ్స్ లో కనిపిస్తోంది. షో టైంకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయని డిస్ట్రిబ్యూటర్ల టాక్. ఇదే జోరు బుధవారం దాకా కొనసాగుతుంది. గురువారం ఓజి రిలీజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మిరాయ్ ఫైనల్ రన్ వైపు వెళ్తున్నట్టే.
ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే ఏపీ సెలవులు బుధవారం నుంచి ఉండాలి. కానీ నారా లోకేష్ పుణ్యమాని అడ్వాన్స్ కావడం మిరాయ్ కలెక్షన్లకు దోహద పడుతుంది. అసలే రెగ్యులర్ టికెట్ రేట్లతో నిర్మాత విశ్వప్రసాద్ చేసిన రిస్క్ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. దాన్ని ఇంకా సద్వినియోగపరుచుకునేలా ఇప్పుడు హాలిడేస్ వచ్చి పడ్డాయి. ఒకవేళ జిఓ సహాయంతో రేట్లు కనక పెంచుకుని ఉంటే సెప్టెంబర్ 21 దాకా అమలులో ఉండేవి. దీని వల్ల ఒక వర్గం కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్లంతా వేరే ఆప్షన్ గురించి ఆలోచించకుండా మిరాయ్ కే ఓటేసి ఫ్యామిలీతో పాటు వెళ్లిపోతున్నారు.
ఇదే ఆఫర్ కిష్కిందపురికి ఉంది కానీ మరీ ఈ స్థాయిలో బెనిఫిట్ కలగకపోవచ్చు. హారర్ జానర్ తో పాటు కొంత మిక్స్డ్ టాక్ రావడం ఫలితం మీద ప్రభావం చూపించింది. అనూహ్యంగా డిమాన్ స్లేయర్ ఊపందుకోవడం గమనించాల్సిన విషయం. ఈ వారం వచ్చిన తాజా రిలీజుల్లో ఏదీ కనీసం యావరేజ్ లేకపోవడం మిరాయ్ కు దక్కిన మరో సానుకూలాంశం. ముందు అనుకున్న డేట్లు రెండు మూడు వదులుకున్నా ఫైనల్ గా మంచే జరిగింది. కాకపోతే సెప్టెంబర్ 25 ఓజి లేకపోయి ఉంటే మిరాయ్ కు కనీసం నాలుగు వారాల స్ట్రాంగ్ రన్ దక్కేదన్న కామెంట్స్ లో ఎంత మాత్రం అబద్దం లేదు. వాస్తవమే.
This post was last modified on September 20, 2025 9:50 pm
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…