బాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ధూమ్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న సిరీస్ జాలీ ఎల్ఎల్బి. పేరుకి కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ మిక్స్ చేసిన తీరు తొలి రెండు భాగాలను సూపర్ హిట్ చేశాయి. వీటిలో ఒకదాన్ని వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తీయాలనుకుని తర్వాత డ్రాప్ అయ్యారు. దాన్నే సప్తగిరి చేయడం, యావరేజ్ ఫలితం అందుకోవడం వేరే విషయం. తాజాగా జాలీ ఎల్ఎల్బి 3 వచ్చింది. ఆడియన్స్ కి దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఫ్లాపుల పర్వానికి ఇది శుభం కార్డు వేస్తుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు.
కథ పరంగా దర్శకుడు సుభాష్ కపూర్ మంచి పాయింటే తీసుకున్నారు కానీ దాన్ని డెవలప్ చేసే క్రమంలో పడిన తడబాటు దీన్నో మాములు మూవీగా మార్చేసింది. పచ్చని పొలాలున్న రైతుల నుంచి వ్యాపారం కోసం భూములు లాక్కున్న వ్యాపారవేత్త మీద చెట్టు కింద ప్లీడర్లు చేసే యుద్ధమే జాలీ ఎల్ఎల్బి 3. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి, గజ్ రాజ్, సౌరభ్ శుక్లా లాంటి ఆర్టిస్టులు తమ శాయశక్తులా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి. కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ ఓవరాల్ గా సినిమా బాగుందని చెప్పడానికి ఎంత మాత్రం సరిపోలేదు.
ఎలాంటి అంచనాలు లేకుండా జాలీ ఎల్ఎల్బి 3 చూస్తే కనీసం యావరేజ్ అనిపిస్తుంది. ఆలా కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏదేదో ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ముఖ్యంగా ఎమోషన్లకు కీలకమైన రైతు బ్యాక్ డ్రాప్ ని హ్యాండిల్ చేసిన తీరు పరమ నీరసంగా, రొటీన్ గా అనిపిస్తుంది. బాధితుల బాధను ఆడియన్స్ అర్థం చేసుకోలేనప్పుడు కోర్టులో నడిచే వాదోపవాదాలు కనెక్ట్ కావు. జాలీ ఎల్ఎల్బి 3లో జరిగింది ఇదే. ఎంత రొటీన్ గా ఉన్నా పర్వాలేదనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు కానీ ఈ క్రేజీ లాయర్ మూడో భాగం మాత్రం అంచనాలు అందుకోలేక చతికిలబడింది.
This post was last modified on September 20, 2025 11:58 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…