కొన్నేళ్ల క్రితం మాదకద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్ ఇరుక్కున్నప్పుడు షారుఖ్ ఖాన్ పడ్డ నరకం అంతా ఇంతా కాదు. వారసుడిగా తన లెగసిని మోస్తాడనుకున్న టైంలో పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగడం అభిమానులను కలచి వేసింది. తర్వాత దాన్నుంచి బయటికి రావడం, కథ సుఖాంతం కావడం వేరే సంగతి. తాజాగా ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన బాడ్స్ అఫ్ బాలీవుడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మొత్తం ఏడు ఎపిసోడ్లు, ఒక్కొక్కటి నలభై అయిదు నుంచి యాభై నిమిషాల నిడివితో ప్రేక్షకుల సమయాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది. ట్రైలర్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
కంటెంట్ ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ కోసం నిన్న వేసిన ప్రీమియర్ కు తారాలోకం మొత్తం కదిలి వచ్చింది. దాని తాలూకు వీడియోలతో సోషల్ మీడియాలో సందడి కనిపించింది. ఈ సిరీస్ లో పెద్ద స్టార్లు క్యామియోలు చేశారు. సల్మాన్ ఖాన్, రన్బీర్ కపూర్, రాజమౌళి, అమీర్ ఖాన్ అలా తళుక్కున వచ్చి వెళ్లిపోయే అతిథులుగా బాగానే సందడి చేశారు. ఇదంతా షారుఖ్ కోసమేనని వేరే చెప్పనక్కర్లేదు. కింగ్ షూటింగ్ లో చేయి విరగొట్టుకున్న షారుఖ్ ఇంకా బ్యాండేజ్ తోనే తిరుగుతున్నాడు. కీలకమైన సమయంలో గాయం కావడం ఫ్యాన్స్ కి బాధ కలిగించినా సిరీస్ అయితే రిలీజైపోయింది.
ఇక బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ విషయానికి వస్తే ఆర్యన్ ఖాన్ ఒక దర్శకుడిగా తనలో విషయముందని ఋజువు చేసుకున్నట్టు ఉత్తరాది రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా తొలి అడుగు అందులోనూ సుదీర్ఘమైన వెబ్ సిరీస్ ఫార్మాట్ ని ఎంచుకోవడం వల్ల ల్యాగ్ గా తీసినట్టు అనిపించినా హిందీ పరిశ్రమలో వివిధ కోణాలను చూపించే ప్రయత్నం చేయడం క్రిటిక్స్ తో ఓకే అనిపిస్తోంది. సాధారణ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించడం కొంచెం కష్టంగానే ఉందట. చివరి ఎపిసోడ్ ని బాగా హ్యాండిల్ చేసిన ఆర్యన్ ఖాన్ దీన్ని సిరీస్ గా కన్నా సినిమాగా మలచి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 18, 2025 9:53 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…