తెలుగులోంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు హిందీకి వెళ్లాయి. కానీ మన కథల్ని బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు కలగాపులగం చేసేయడం.. ఆయా సినిమాలు లుక్నే మార్చేయడం చాలాసార్లు చూశాం. రెడీ, కిక్, వర్షం, క్షణం లాంటి సినిమాలను హిందీలో చూస్తే ఒరిజినల్తో చాలా తక్కువ పోలికలు కనిపిస్తాయి. మూల కథను తీసుకుని వేరే ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాలు తీయడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడ సినిమాలు యథాతథంగా హిందీలోకి వెళ్లిన సందర్భాలు అరుదు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు. మాతృకతో పోలిస్తే దానికి పెద్దగా తేడా కనిపించదు. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాను హిందీలో యథాతథంగా దించేశారు. ఆ చిత్రమే.. దుర్గామతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన హిట్ సినిమా ‘భాగమతి’కి ఇది రీమేక్.
మాతృకను రూపొందించిన అశోకే హిందీ వెర్షన్కు కూడా దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ను ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలు బలంగా ఫిక్సయినట్లున్నారు. అశోక్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తెలుగు వెర్షన్ను యథాతథంగా తీయడానికి ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. తాజాగా రిలీజైన ‘దుర్గామతి’ ట్రైలర్ చూస్తే అందులోని ప్రతి విజువల్ కూడా తెలుగులో చూసిందే. కాకపోతే భాగమతి సెట్టింగ్లో కొంచెం మార్పులు చేసినట్లున్నారంతే. దాన్ని మినహాయిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినట్లున్నారు.
హిందీలో అనుష్క పాత్రలో చేసిన భూమి పడ్నేకర్.. లీడ్ రోల్కు ఎంతమాత్రం సరితూగనట్లు అనిపించింది. అనుష్క ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ను ఆమె ఏమాత్రం మ్యాచ్ చేయలేదని ఒరిజినల్ చూసిన వాళ్లందరూ చెప్పేస్తారు. తెలుగులో జయరాం చేసిన విలన్ పాత్రలో అర్షద్ వార్సి ఓకే అనిపించాడు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబరు 11న విడుదల కాబోతోంది. మరి మన తెలుగు దర్శకుడికి బాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on November 25, 2020 5:55 pm
రామాయణ టీజర్ మీద సోషల్ మీడియాలో ఎంత నెగటివిటీ నడుస్తుందో తెలిసిందే. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ వాటి ప్రెజెంటేషన్, క్వాలిటీ…
మొన్న విడుదలైన రాకాస, బైకర్ రెండూ స్టడీగా ఉన్నాయి. అయితే వాటికొచ్చిన టాక్స్ తో పోల్చుకుంటే వసూళ్లు అంత వేగంగా…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్…
టాలీవుడ్లో అడివి శేష్ది విచిత్రమైన ప్రయాణం. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కర్మ, కిస్ సినిమాలు తీసి బొక్క బోర్లా పడ్డ అతను..…
ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర…
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లో పూజలు నిర్వహించటానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ (ధార్మిక పరిషత్).. శృంగేరి…