Movie News

అనుష్క ముందు ఆమె తేలిపోయిందిగా..

తెలుగులోంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు హిందీకి వెళ్లాయి. కానీ మన కథల్ని బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు కలగాపులగం చేసేయడం.. ఆయా సినిమాలు లుక్‌నే మార్చేయడం చాలాసార్లు చూశాం. రెడీ, కిక్, వర్షం, క్షణం లాంటి సినిమాలను హిందీలో చూస్తే ఒరిజినల్‌తో చాలా తక్కువ పోలికలు కనిపిస్తాయి. మూల కథను తీసుకుని వేరే ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాలు తీయడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడ సినిమాలు యథాతథంగా హిందీలోకి వెళ్లిన సందర్భాలు అరుదు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు. మాతృకతో పోలిస్తే దానికి పెద్దగా తేడా కనిపించదు. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాను హిందీలో యథాతథంగా దించేశారు. ఆ చిత్రమే.. దుర్గామతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన హిట్ సినిమా ‘భాగమతి’కి ఇది రీమేక్.

మాతృకను రూపొందించిన అశోకే హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. ఒరిజినల్‌ను ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలు బలంగా ఫిక్సయినట్లున్నారు. అశోక్‌కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తెలుగు వెర్షన్‌ను యథాతథంగా తీయడానికి ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. తాజాగా రిలీజైన ‘దుర్గామతి’ ట్రైలర్‌ చూస్తే అందులోని ప్రతి విజువల్ కూడా తెలుగులో చూసిందే. కాకపోతే భాగమతి సెట్టింగ్‌లో కొంచెం మార్పులు చేసినట్లున్నారంతే. దాన్ని మినహాయిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినట్లున్నారు.

హిందీలో అనుష్క పాత్రలో చేసిన భూమి పడ్నేకర్.. లీడ్ రోల్‌కు ఎంతమాత్రం సరితూగనట్లు అనిపించింది. అనుష్క ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్‌, పెర్ఫామెన్స్‌ను ఆమె ఏమాత్రం మ్యాచ్ చేయలేదని ఒరిజినల్ చూసిన వాళ్లందరూ చెప్పేస్తారు. తెలుగులో జయరాం చేసిన విలన్ పాత్రలో అర్షద్ వార్సి ఓకే అనిపించాడు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబరు 11న విడుదల కాబోతోంది. మరి మన తెలుగు దర్శకుడికి బాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

This post was last modified on November 25, 2020 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago