తెలుగులోంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు హిందీకి వెళ్లాయి. కానీ మన కథల్ని బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు కలగాపులగం చేసేయడం.. ఆయా సినిమాలు లుక్నే మార్చేయడం చాలాసార్లు చూశాం. రెడీ, కిక్, వర్షం, క్షణం లాంటి సినిమాలను హిందీలో చూస్తే ఒరిజినల్తో చాలా తక్కువ పోలికలు కనిపిస్తాయి. మూల కథను తీసుకుని వేరే ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాలు తీయడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడ సినిమాలు యథాతథంగా హిందీలోకి వెళ్లిన సందర్భాలు అరుదు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు. మాతృకతో పోలిస్తే దానికి పెద్దగా తేడా కనిపించదు. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాను హిందీలో యథాతథంగా దించేశారు. ఆ చిత్రమే.. దుర్గామతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన హిట్ సినిమా ‘భాగమతి’కి ఇది రీమేక్.
మాతృకను రూపొందించిన అశోకే హిందీ వెర్షన్కు కూడా దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ను ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలు బలంగా ఫిక్సయినట్లున్నారు. అశోక్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తెలుగు వెర్షన్ను యథాతథంగా తీయడానికి ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. తాజాగా రిలీజైన ‘దుర్గామతి’ ట్రైలర్ చూస్తే అందులోని ప్రతి విజువల్ కూడా తెలుగులో చూసిందే. కాకపోతే భాగమతి సెట్టింగ్లో కొంచెం మార్పులు చేసినట్లున్నారంతే. దాన్ని మినహాయిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినట్లున్నారు.
హిందీలో అనుష్క పాత్రలో చేసిన భూమి పడ్నేకర్.. లీడ్ రోల్కు ఎంతమాత్రం సరితూగనట్లు అనిపించింది. అనుష్క ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ను ఆమె ఏమాత్రం మ్యాచ్ చేయలేదని ఒరిజినల్ చూసిన వాళ్లందరూ చెప్పేస్తారు. తెలుగులో జయరాం చేసిన విలన్ పాత్రలో అర్షద్ వార్సి ఓకే అనిపించాడు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబరు 11న విడుదల కాబోతోంది. మరి మన తెలుగు దర్శకుడికి బాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on November 25, 2020 5:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…