తెలుగులోంచి గత కొన్నేళ్లలో చాలా సినిమాలు హిందీకి వెళ్లాయి. కానీ మన కథల్ని బాలీవుడ్ రైటర్లు, డైరెక్టర్లు కలగాపులగం చేసేయడం.. ఆయా సినిమాలు లుక్నే మార్చేయడం చాలాసార్లు చూశాం. రెడీ, కిక్, వర్షం, క్షణం లాంటి సినిమాలను హిందీలో చూస్తే ఒరిజినల్తో చాలా తక్కువ పోలికలు కనిపిస్తాయి. మూల కథను తీసుకుని వేరే ట్రీట్మెంట్ ఇచ్చి సినిమాలు తీయడం బాలీవుడ్ జనాలకు అలవాటు. ఇక్కడ సినిమాలు యథాతథంగా హిందీలోకి వెళ్లిన సందర్భాలు అరుదు.
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లాంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు. మాతృకతో పోలిస్తే దానికి పెద్దగా తేడా కనిపించదు. కాగా ఇప్పుడు మరో తెలుగు సినిమాను హిందీలో యథాతథంగా దించేశారు. ఆ చిత్రమే.. దుర్గామతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన హిట్ సినిమా ‘భాగమతి’కి ఇది రీమేక్.
మాతృకను రూపొందించిన అశోకే హిందీ వెర్షన్కు కూడా దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ను ఎంతమాత్రం మార్చాల్సిన అవసరం లేదని నిర్మాతలు బలంగా ఫిక్సయినట్లున్నారు. అశోక్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తెలుగు వెర్షన్ను యథాతథంగా తీయడానికి ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. తాజాగా రిలీజైన ‘దుర్గామతి’ ట్రైలర్ చూస్తే అందులోని ప్రతి విజువల్ కూడా తెలుగులో చూసిందే. కాకపోతే భాగమతి సెట్టింగ్లో కొంచెం మార్పులు చేసినట్లున్నారంతే. దాన్ని మినహాయిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినట్లున్నారు.
హిందీలో అనుష్క పాత్రలో చేసిన భూమి పడ్నేకర్.. లీడ్ రోల్కు ఎంతమాత్రం సరితూగనట్లు అనిపించింది. అనుష్క ఆహార్యం, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ను ఆమె ఏమాత్రం మ్యాచ్ చేయలేదని ఒరిజినల్ చూసిన వాళ్లందరూ చెప్పేస్తారు. తెలుగులో జయరాం చేసిన విలన్ పాత్రలో అర్షద్ వార్సి ఓకే అనిపించాడు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబరు 11న విడుదల కాబోతోంది. మరి మన తెలుగు దర్శకుడికి బాలీవుడ్ ఎంట్రీలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
This post was last modified on November 25, 2020 5:55 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…