నిన్న ఏపీ ప్రభుత్వం ఓజి టికెట్ రేట్లు ప్రీమియర్లకు సంబంధించిన జిఓ విడుదల చేయడం ఫ్యాన్స్ లో ఎంతో సంతోషం కొంత అయోమయం లేవనెత్తింది. అర్ధరాత్రి 1 గంటకు వెయ్యి రూపాయల టికెట్ రేట్ ఫిక్స్ చేయడం వరకు హ్యాపీనే. చాలా పెద్ద రికార్డు నమోదవుతుంది. కానీ ఫస్ట్ డే కేవలం అయిదు షోలకు మాత్రమే అనుమతి ఇవ్వడం కన్ఫ్యూజన్ కు దారి తీస్తోంది. ఎందుకంటే స్పెషల్ షో అయ్యాక తర్వాత ఆట పది లేదా పదకొండు మధ్యలో మొదలుపెట్టాలి. ఒకవేళ అంతకన్నా ముందు ఏ ఏడు గంటలకో షో వేస్తే మధ్యాన్నం, లేదా రాత్రి సెకండ్ షోలో ఒకటి ఎగిరిపోతుంది. ఇది పెద్ద దెబ్బ.
పుష్ప 2, దేవరకు ఈ సమస్య రాలేదు. ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా చేశారానే అనుమానం అభిమానుల్లో తలెత్తుతోంది. ఎందుకంటే ఒంటి గంట షో అయ్యాక సుమారు అయిదారు గంటల గ్యాప్ రావడం ఎంత మాత్రం సేఫ్ కాదు. టాక్ రకరకాలుగా పాకిపోతుంది. పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పాయిలర్స్ రూపంలో దాన్ని చెడగొట్టే బ్యాచ్ సోషల్ మీడియాలో ఎలాగూ ఉంటుంది. అలా కాకుండా వరసగా షోలు పడితే ఆడియన్స్ కి ఆలోచించుకునే టైం ఉండదు. చకచకా టికెట్లు కొనేసుకుని థియేటర్లకు వెళ్ళిపోతారు. ఏదైనా సవరణతో కొత్త జిఓ రావాలని ఫ్యాన్సే కాదు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.
ఇప్పటికైతే ఓజికి మొదటి రోజు షోల కథ ఇలా ఉంది. పది రోజుల పాటు భారీ పెంపు ఇవ్వడంతో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మటుకు రాజమౌళి, పుష్ప రికార్డులను ఓజి టచ్ చేయబోతోంది. ఇప్పటిదాకా రికార్డుల పరంగా కొంచెం వెనుకబడి ఉన్న పవన్ ఆ ఆకలిని పూర్తిగా ఓజితో తీరుస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ముఖ్యంగా ప్రీమియర్ కు వెయ్యి రూపాయలంటేనే లెక్కచేయని అభిమానుల జోష్ చూస్తుంటే రెగ్యులర్ షోలకు టికెట్లు దొరకడం అనుమానంగానే ఉంది. అందరి నమ్మకం సుజిత్ మీదే. ఫ్యాన్ బాయ్ గా తన పవర్ స్టార్ ని ఎలా చూపిస్తాడోననే ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ ఉంది. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on September 18, 2025 11:35 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…