‘బాహుబలి’ తర్వాత వరుసగా మూడు ఫెయిల్యూర్లతో అభిమానులను నిరాశపరిచాడు రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ‘సలార్’ దగ్గర్నుంచి ప్రభాస్ రాత మారింది. ఆ సినిమా మళ్లీ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక గత ఏడాది వచ్చిన ‘కల్కి’ అంచనాలను అందుకుని ఇంకా పెద్ద హిట్టయింది. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రభాస్ తర్వాతి చిత్రాల లైనప్ కూడా క్రేజీగా కనిపిస్తోంది.
రెబల్ స్టార్ నెక్స్ట్ రిలీజ్ ‘రాజా సాబ్’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్లాపుల్లో ఉన్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రభాస్ మొదలుపెట్టినపుడు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయేలా కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
‘రాజా సాబ్’ గురించి టీంలో ఎవ్వరు మాట్లాడినా.. చాలా గొప్పగా చెబుతున్నారు. మారుతి కూడా సందర్భం వచ్చినపుడల్లా సినిమా ఒక రేంజిలో ఉంటుందనే అంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి.. ఈ సినిమాలోని ఒక డ్యాన్స్ నంబర్ గురించి మాట్లాడాడు. ప్రభాస్ నుంచి మామూలుగా అభిమానులు పెద్దగా డ్యాన్సులు ఆశించారు. అతను నృత్యాల మీద దృష్టిపెట్టడం తక్కువ. ముఖ్యంగా ‘బాహుబలి’ నుంచి తన సినిమాల్లో డ్యాన్సులకు స్కోపే ఉండట్లేదు. తన కథల్లో భారీతనం, స్పాన్ పెరిగిపోయి డ్యాన్స్ నంబర్స్ పెట్టే అవకాశమే ఉండట్లేదు.
కానీ ‘రాజా సాబ్’లో మాత్రం ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేసినట్లు సంకేతాలు ఇచ్చాడు మారుతి. ఇందులో ఒక పాట కోసం టాప్ కొరియాగ్రాఫర్లలో ఒకడైన ప్రేమ్ రక్షిత్ను ఎంచుకున్నట్లు మారుతి తెలిపాడు. ప్రభాస్ను ఎంత బాగా చూపించాలనే విషయంలో లక్ష మంది అభిమానుల ఆకలి తన ఒక్కడికే ఉందని.. అందుకే బిజీగా ఉన్నప్పటికీ ఏరి కోరి రక్షిత్ను తీసుకున్నానని.. తన కొరియోగ్రఫీలో ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేశాడని మారుతి తెలిపాడు. ఈ పాటనే ‘రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 17, 2025 1:00 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…