‘బాహుబలి’ తర్వాత వరుసగా మూడు ఫెయిల్యూర్లతో అభిమానులను నిరాశపరిచాడు రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ‘సలార్’ దగ్గర్నుంచి ప్రభాస్ రాత మారింది. ఆ సినిమా మళ్లీ అభిమానుల్లో జోష్ నింపింది. ఇక గత ఏడాది వచ్చిన ‘కల్కి’ అంచనాలను అందుకుని ఇంకా పెద్ద హిట్టయింది. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ప్రభాస్ తర్వాతి చిత్రాల లైనప్ కూడా క్రేజీగా కనిపిస్తోంది.
రెబల్ స్టార్ నెక్స్ట్ రిలీజ్ ‘రాజా సాబ్’ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్లాపుల్లో ఉన్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రభాస్ మొదలుపెట్టినపుడు అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయేలా కొన్ని నెలల కిందట రిలీజ్ చేసిన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
‘రాజా సాబ్’ గురించి టీంలో ఎవ్వరు మాట్లాడినా.. చాలా గొప్పగా చెబుతున్నారు. మారుతి కూడా సందర్భం వచ్చినపుడల్లా సినిమా ఒక రేంజిలో ఉంటుందనే అంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి.. ఈ సినిమాలోని ఒక డ్యాన్స్ నంబర్ గురించి మాట్లాడాడు. ప్రభాస్ నుంచి మామూలుగా అభిమానులు పెద్దగా డ్యాన్సులు ఆశించారు. అతను నృత్యాల మీద దృష్టిపెట్టడం తక్కువ. ముఖ్యంగా ‘బాహుబలి’ నుంచి తన సినిమాల్లో డ్యాన్సులకు స్కోపే ఉండట్లేదు. తన కథల్లో భారీతనం, స్పాన్ పెరిగిపోయి డ్యాన్స్ నంబర్స్ పెట్టే అవకాశమే ఉండట్లేదు.
కానీ ‘రాజా సాబ్’లో మాత్రం ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేసినట్లు సంకేతాలు ఇచ్చాడు మారుతి. ఇందులో ఒక పాట కోసం టాప్ కొరియాగ్రాఫర్లలో ఒకడైన ప్రేమ్ రక్షిత్ను ఎంచుకున్నట్లు మారుతి తెలిపాడు. ప్రభాస్ను ఎంత బాగా చూపించాలనే విషయంలో లక్ష మంది అభిమానుల ఆకలి తన ఒక్కడికే ఉందని.. అందుకే బిజీగా ఉన్నప్పటికీ ఏరి కోరి రక్షిత్ను తీసుకున్నానని.. తన కొరియోగ్రఫీలో ప్రభాస్ అదిరిపోయే డ్యాన్సులు వేశాడని మారుతి తెలిపాడు. ఈ పాటనే ‘రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…