యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్ మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు అంచనా వేసిన సినిమా.. లైగర్. ఇస్మార్ట్ శంకర్తో హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్తో విజయ్ జట్టు కట్టడంతో ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో మొదట్నుంచే ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. మేకింగ్ మధ్యలో ఉండగా.. ఈ ప్రాజెక్టులోకి లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ రావడంతో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక తెలుగు సినిమాలో టైసన్ నటించడమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఆయన పాత్ర గురించి ఎంతో ఊహించుఉన్నారు. తీరా చూస్తే లైగర్లో టైసన్ పాత్ర తుస్సుమనిపించింది. కొన్నినిమిషాల నిడివి కోసం పాతిక కోట్లు పుచ్చుకున్న టైసన్.. సినిమాకు ఏమాత్రం వాల్యూ అడిషన్ కాలేకపోయాడు.
ఈ క్యారెక్టర్ విషయంలో తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇలాంటి ప్రయోగం విజయ్ ఇక మళ్లీ చేయడు అనుకున్నారంతా. కానీ మళ్లీ విజయ్ సినిమాలో ఇలాంటి కాస్టింగే జరిగినట్లు సమాచారం. కానీ విజయ్ కొత్త చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లూను నటింపజేస్తున్న విషయం ఖరారైంది. ఆర్నాల్డ్ ఓస్లూ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. హలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటైన మమ్మీ సినిమాలో విలన్గా నటించిన ఆర్టిస్ట్ అంటే ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమాకు ఆర్నాల్డ్కు వరల్డ్ వైడ్ మామూలు గుర్తింపు రాలేదు.
తర్వాత అతను మరెన్నో సినిమాల్లో నటించినా.. మమ్మీతో వచ్చిన ఫేమే వేరు. ఈ నటుడిని విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు విలన్గా తీసుకుంటున్నట్లు కొన్ని నెలల ముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ కోసం ఆర్నాల్డ్ను తీసుకున్నారు. మరి ఒక హాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నారంటే సినిమాలో విదేశీ నేపథ్యం ఏదో ఉంటుందని భావిస్తున్నారు. విజయ్ విజయాల్లో లేకపోయినా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ లుక్ మార్చేశాడు. ఇది కొన్ని వందల ఏళ్ల కిందటి కథతో సాగుతుందని సమాచారం.
This post was last modified on September 17, 2025 7:45 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…